తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్; 37 మంది మరణం 38 మంది గల్లంతు
సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల అంచనాలకు మించిన జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ స్థాయిలో నష్టాలు జరుగుతాయో పాఠకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ప్రస్తుతం భారతదేశంలో ఒకవైపు కరోనా మహమ్మారి వ్యాపించి ప్రజల ప్రాణాలను హరిస్తుంటే మరోవైపు తౌక్తే తుఫాన్ భీభత్సం సృష్టిస్తోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రజలు ఇల్లుదాటి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఈ మహమ్మారి ఇప్పుడు మాత్రమే కాదు గత సంవత్సరం నుంచి చాలా ఆటంకాలను కలిగిస్తోంది. ఈ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు భారతదేశంలో మొదలైన తౌక్తే తుఫాన్ దక్షిణ భారతదేశంలో చాలా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాన్ గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్ర తీరాలను తాకింది. అరేబియా సమంద్రంలో పుట్టిన ఈ తుపాన్ కేరళ మరియు తమిళనాడువంటి రాష్ట్రాల్లో కూడా తన ప్రభావాన్ని చూపింది.

ఇప్పుడు ఈ తౌక్టే తుఫాన్ వల్ల ఒఎన్జిసి యాజమాన్యంలోని ఆయిల్ ట్యాంకర్ అరేబియా సముద్రంలో మునిగిపోయింది. అంతే కాకుండా ఈ తుపాన్ కారణంగా ఆ ప్రాంతాలలో విద్యత్ మరియు మంచినీటి కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.

అరేబియా సముద్రంలో మునిగిపోయింది మునిగిపోయిన ఈ ఆయిల్ ట్యాంకర్ వల్ల దాదాపు 37 మంది మరణించారు. మిగిలిన 38 మంది జాడ కనిపించలేదు. వీరికోసం ప్రస్తుతం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. తుపాను యొక్క అధిక ఉదృత కారణంగా ఓడ యొక్క యాంకర్లు ధ్వంసం కావడంతో ఈ ఓడ సముద్రంలో మునిగిపోయింది.

ఆపరేషన్ సమయంలో ఓడలో ఉన్న 800 మందికి పైగా వారిని రక్షించారు. కానీ ఓడలో ఉన్న 37 మంది మరణించినట్లు ధృవీకరించబడింది. ఇది చాలా విషాదకరమైన సంఘటన. లక్షద్వీప్ సమీపంలో అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫాన్ మే 17 న గుజరాత్ తీరాన్ని తాకింది.

ప్రస్తుతం ఈ తౌక్టే తుఫాన్ మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రమే కాకూండా కర్ణాటక మరియు కేరళలో కూడా ఎక్కువ వినాశనాన్ని సృష్టించింది. కేరళ రాష్ట్రంలో తౌక్టే తుఫాన్ వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కేరళ తీరప్రాంత జిల్లాలను తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.

అంతే కాకుండా కర్ణాటక తీరం వెంబడి ఉన్న దాదాపు 200 కి పైగా గ్రామాలు ఈ తుఫాను ప్రభావంలో చిక్కుకున్నాయి. ముంబైలో 70 శాతం చెట్లు తుఫాను కారణంగా దెబ్బతిన్నట్లు సమాచారం. గుజరాత్ లో తుఫాను వల్ల మరణించిన వారి సంఖ్య 49 కి పెరిగింది. ఈ రకమైన తుఫాను గుజరాత్ను 23 సంవత్సరాల వచ్చిందని సామజిక వర్గాలు తెలిపాయి.

గుజరాత్ లోని చాలా జిల్లాల్లో విద్యుత్ కోత ఉంది, కావున ఈ విద్యుత్ అంతరాయం వల్ల మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. ఈ తుపాన్ ప్రభావిత ప్రాంతాలపై ఇటీవల దేశ ప్రధానమంత్రి మోడీ హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించారు. మన సమీప రాష్ట్రమైన తమిళనాడులో కూడా ఈ తుపాన్ కారణంగా కొన్ని జిల్లాల్లో విస్తృతంగా వర్షపాతం నమోదవుతోంది.


Click it and Unblock the Notifications








