లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న మరో బాలీవుడ్ సెలబ్రెటీ.. ఎవరంటే?
సాధారణంగా సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తుంటారన్న విషయం దాదాపు అందరికి తెలిసిందే, ఇటీవల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు బాలీవుడ్ సింగర్ శ్రీ సింఘాల్ కొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్యూవీని కొనుగోలు చేశారు.

శ్రేయ్ సింఘాల్ కొనుగోలు చేసిన ఈ కారు ఎల్లో కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కలర్ ఆప్షన్ చాలా విలాసవంతంగా మరియు చూసేవారికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను శ్రేయ్ సింఘాల్ షేర్ చేసాడు. లంబోర్ఘిని ఉరుస్ భారత మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన లగ్జరీ కారు.

లంబోర్ఘిని ఉరుస్ పరిమాణంలో చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది మంచి డిజైన్ తో చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇది మొదటి చూపులోనే చూపరుల చూపు తిప్పుకోకుండా చేస్తుంది, ఇది ఎస్యూవీ అయినప్పటికీ, స్లైడింగ్ రూఫ్ను కలిగి ఉంది.

లంబోర్ఘిని కంపెనీ అవెంటడార్ మరియు హురాకాన్ వంటి కార్లను కూడా విక్రయిస్తున్నప్పటికీ, భారతదేశ రహదారులపై డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉండదు. అంతే కాకుండా ఉరుస్ ఎస్యూవీ భారతీయ రహదారులపై సులభంగా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

సింగర్ శ్రేయ్ సింఘాల్ యొక్క పసుపు రంగు లంబోర్ఘిని ఉరుస్ ని 'జియాలౌ ఆగ్' అని పిలుస్తాడు, అంటే 'ఎల్లో బూమ్' అని అర్థం. ఈ ఎస్యూవీ పూర్తిగా ఎల్లో కలర్ లో ఉన్నప్పటికీ, దాని రూప్ మాత్రం కార్బన్ ఫైబర్లో ఉంది. ఈ కార్బన్ ఫైబర్ వల్ల కారు యొక్క బరువు తక్కువగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఈ ఎస్యూవీలో ఎల్లో పిన్స్ట్రిప్పింగ్తో బ్లాక్ అల్లాయ్ వీల్ ఉంటుంది. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కలర్ ఎస్యూవీని ఎక్కువగా ఇష్టపడతారు. ఇటీవల కార్తీక్ ఆర్యన్, దానికి ముందు రణవీర్ సింగ్ మరియు రోహిత్ శెట్టి కూడా ఈ ఎస్యూవీని కొనుగోలు చేశారు.

లంబోర్ఘిని ఉరుస్ విషయానికి వస్తే, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ చెందిన లంబోర్ఘిని బ్రాండ్. దీనికి భారత మార్కెట్లో కూడా మంచి స్పందన లభిస్తోంది. భారతదేశంలో దాదాపు 100 యూనిట్ల ఉరుస్ కార్లను అమ్మినట్లు ఇటీవల కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

లంబోర్ఘిని ఉరుస్ లో 4.0 లీటర్, 8 సిలిండర్ ట్విన్-టర్బో వి 8 ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 641 బిహెచ్పి పవర్ మరియు 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతం అవుతుంది.

లంబోర్ఘిని ఉరుస్ యొక్క గరిష్ట వేగం గంటకు 305 కిమీ. ఉరుస్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన లంబోర్ఘిని బ్రాండ్ కారు. గతేడాది కరోనా మహమ్మారి తరువాత కూడా కంపెనీ 52 యూనిట్ల ఉరుస్ను విక్రయించింది. ఈ లంబోర్ఘిని ఉరుస్ అమ్మకాల పరముగా ముందుకు దూసుకెళ్తోంది.


Click it and Unblock the Notifications








