Just In
- 8 min ago కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- 1 hr ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 1 hr ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
- 16 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
Don't Miss
- Sports PSL Final: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి విజయం Video
- News తల పట్టుకున్న మాజీ ప్రధాని, మోదీ మాట వింటారా ?, ఫ్యామిలీ సమస్యలతో ఆ సీటు గోవిందా ?
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు శుభవార్త.. ఈ సారి జీతాల పెంపు ఎంత శాతమంటే..??
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Movies బ్రహ్మముడిని భారీ దెబ్బ కొట్టిన కార్తీక దీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు రీఎంట్రీతో అంతా ఛేంజ్!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే.. మీకు తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న దేశాలలో భారతదేశం ఒకటి. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం. ఇదిలా ఉంటే కొన్ని సార్లు దూర ప్రయాణాలు జరిగేటప్పుడు నిద్ర కూడా ప్రమాదానికి ప్రధాన కారణం అవుతుంది.
నిద్ర సమయంలో డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదం. అంతే కాదు ఇది ప్రాణాంతకం కూడా. నిద్ర సమయంలో డ్రైవింగ్ చేయడం వాహనదారుల ప్రాణాలకు మాత్రమే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే ఇతరుల వాహదారుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగిస్తుంది.
భారతదేశంలో నిద్రలేమి వల్ల ఎక్కువగా ట్రక్ ప్రమాదాలు జరుగుతాయి. ట్రక్ ప్రమాదాలకు ప్రధాన కారణం ట్రక్ డ్రైవర్లే అని నివేదికలు చెబుతున్నాయి. మనదేశంలో ట్రక్ డ్రైవర్లలో ఎక్కువమంది నిద్రలేమితో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.
MOST READ:ఫ్రీ వ్యాక్సిన్ సర్వీస్ ప్రారంభించిన ఎంజి మోటార్.. కేవలం వారికీ మాత్రమే
ట్రక్కును నడుపుతున్నప్పుడు ఈ రకమైన నిద్రలేమితో బాధపడేవారు ప్రమాదానికి గురయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సేవ్ లైఫ్ ఫౌండేషన్ మరియు మహీంద్రా పరిశోధనల ప్రకారం, దేశంలో ప్రతి ఇద్దరి ట్రక్ డ్రైవర్లలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఒక ట్రక్ రోజుకు సగటున 12 గంటలు ప్రయాణిస్తుంది.
ఈ ట్రక్ డ్రైవర్లలో చాలామందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అనే రకమైన వ్యాధి ఉంది. చాలా మంది ట్రక్ డ్రైవర్లకు ఈ వ్యాధి గురించి తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటువంటి వాటికి సరైన ట్రీట్మెంట్ కూడా లేదు, కావున చాలామంది దీనితోనే బాధపడుతున్నారని ఒక పరిశోధనలో వెల్లడైంది.
MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?
అయితే దాదాపు 80% ట్రక్ డ్రైవర్లు ఈ వ్యాధికి కొంత వరకు తగ్గించుకోవడానికి చికిత్స పొందలేకపోతున్నారు. నివేదికల ప్రకారం భారతదేశంలో ఈ రోగంతో బాధపడేవారి సంఖ్య దాదాపు 250 మిలియన్లకు పైగా ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారికి పగటిపూట ఎక్కువ నిద్ర వస్తుంది. అంతే కాదు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నిద్ర వస్తుంది.
ఈ విధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు వహీ నిద్ర ప్రమాదానికి దారితీస్తుందని నివేదిక పేర్కొంది. డ్రైవింగ్ సమయంలో కొంత నిద్ర కూడా అత్యంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇది ప్రాణాలు సైతం కోల్పోవడానికి కారణమవుతుంది. ఇది రోడ్డుపై వున్న ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది.
MOST READ:వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ
ఉత్తర భూభాగంలోని కింగ్ జార్జ్ మెడికల్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధన ప్రకారం, ఒక వ్యక్తి కేవలం 5 గంటలు నాలుగు రాత్రులు నిద్రపోతే, అతని శరీరంలో ఆల్కహాల్ మొత్తం 0.6% పెరుగుతుంది. ఈ మోతాదు క్రమంగా పెరిగితే చాలా ప్రమాదానికి గురవుతుందని పరిశోధనలో తేలింది.
పగటిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర లేమి డ్రైవర్లు నిద్రపోతున్నారని సర్వేలో తేలింది. ఇది రోడ్డు ప్రమాదాన్ని 300% పెంచుతుంది. ఇటువంటి డ్రైవర్లకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు ఏకాగ్రత సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాత్రి మెలకువగా ఉండే ట్రక్ మరియు టాక్సీ డ్రైవర్లలో స్లీప్ డిజార్డర్స్ ఎక్కువగా కనిపిస్తుంది.
MOST READ:జెసిబి వల్ల బయటపడిన బీచ్లో చిక్కుకున్న థార్[వీడియో]
ఈ పరిశోధనలో పాల్గొన్న 100 మంది ట్రక్ డ్రైవర్లలో 23 మందికి నిద్రలేమి ఉన్నట్లు నిర్ధారణ అయింది. కావున ఇటువంటి వారు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే వారి ప్రాణాలకు మరియు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే