Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 12 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 13 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 14 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Movies Guppedantha Manasu March 29th: మను ఇక్కడే ఉంటాడంటున్న వసు.. వద్దంటూ గొడవ చేస్తున్న అనుపమ!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నడిరోడ్డుపై చిందేసి హంగామా చేసిన భామ [వీడియో].. తర్వాత ఏం జరిగిందంటే?
సాధారణంగా కొంతమంది వ్యక్తులు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కువ మంది అనుచరులను సంపాదించడానికి వివిధ రకాల విన్యాసాలకు పాల్పడుతుంటారు. ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి చాలామంది యువత చేసిన విన్యాసాలు కోకొల్లలు. అయితే ఇలాంటివి కొన్ని సార్లు వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి. ఇలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
నివేదికల ప్రకారం మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన 'శ్రేయా కల్రా' అనే సోషల్ మీడియా సెలబ్రిటీ రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేసింది. నడిరోడ్డుపై డ్యాన్స్ చేసిన శ్రేయ కల్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇండోర్లోని రసోమా జంక్షన్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రజా రహదారిలో ట్రాఫిక్ సిగ్నెల్స్ వద్ద, ట్రాఫిక్ లైట్ వెలిగిన తరువాత ఆమె జీబ్రా క్రాసింగ్పై డ్యాన్స్ చేసింది. సిగ్నల్ వద్ద నిలబడి ఉన్న వాహనదారులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకు ప్రజల దృష్టిని ఆకర్షించే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నారని భావించారు. కానీ ఆమె అలాంటివి కాకుండా సాధారణంగా డ్యాన్స్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతూ, ఇది మీడియా ద్వారా ప్రసారం చేయబడింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆమె గురించి సమాచారాన్ని సేకరించారు. అంతే కాకుండా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్ ట్రాఫిక్ పోలీసు ASP అనిల్ పటీదార్ మీడియాకు తెలిపారు.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మరియు డ్యాన్స్ చేసి వీడియో రికార్డ్ చేసిన శ్రేయ మరియు ఆమె సహచరుడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం, ట్రాఫిక్ జామ్ మధ్యలో చిక్కుకున్న కార్ల పైన డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఒక యువతి షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అయ్యింది మరియు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. వెంటనే పోలీసులు ఆమెకు సమాచారం అందించారు.
ప్రస్తుతం భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే డిజిటల్ చలాన్ రావడంతో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడ కనిపించే వీడియోల వంటి డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. ముందు జరిగిన సంఘటనలో యువతి వాహనాన్ని ఉపయోగించకపోయినప్పటికీ, ఆమె రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఇది చట్టవిరుద్ధం కూడా. ఈ నేపథ్యంలోనే ఆమెకు నోటీసు జారీ చేశారు.
ఇప్పుడు దేశ వ్యాప్తంగా దాదాపు చాలా నగరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి. పోలీసులు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇవన్నీ క్రిమినల్ కేసులను ఛేదించడానికి ఉపయోగపడుతున్నాయి. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్లను ట్రాక్ చేయడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించిన వారికి సీసీటీవీల సహాయంతో చలాన్లు జారీ చేయబడుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే, రోడ్డు ప్రమాదాలకు అత్యంత ప్రధాన కారణం.
ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించడానికి మరియు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 2019 లో అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులకు భారీ జరిమానా విధించబడుతుంది.
హైవేలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ రోడ్డు విస్తరణ వంటి చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఉన్న రోడ్లను విస్తరించి అప్గ్రేడ్ చేస్తున్నారు. వాహనాల్లో భద్రతా ఫీచర్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం వాహన తయారీదారులను కూడా ఆదేశించింది.
ఇందులో భాగంగానే బైక్లలో, హెడ్లైట్లు ఏర్పాటు చేయబడుతున్నాయి. అన్ని బైక్లపై హెడ్లైట్లు ఎల్లప్పుడూ ఆన్ చేసి ఉంటాయి. ఇకపై రానున్న అన్ని కార్లలో ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్లను తప్పనిసరిగా జారీ చేయాలని కార్ల తయారీదారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇవన్నీ కూడా వాహనదారుల భద్రతను నిర్దారింఛి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోకుండా చేస్తుంది. అయితే వాహనదారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి.