Just In
- 2 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 3 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తండ్రి కోసం 13 సంవత్సరాల క్రితం అమ్మిన కారుని తిరిగి తండ్రికి గిఫ్ట్గా ఇచ్చిన కొడుకు
చాలా మందికి వారి వాహనాలతో ఎనలేని సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వారు తమ జీవితంలో కొనుగోలు చేసిన మొదటి వాహనం కావడమే. చాలా సంవత్సరాల క్రితం జీవితంలో మొదటి కారు కోండం అనేది నిజంగా ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. ఇలాంటి సంఘటనే మనం ఇప్పుడు చూడబోతున్నాం..
13 సంవత్సరాల క్రితం తన జీవితంలో మొదటి కారును కొన్న వ్యక్తి కేరళలోని కోజికోడ్కు చెందిన అబ్దుల్ నజీర్. అబ్దుల్ నజీర్ 1992 లో మారుతి 800 ను వారి మొదటి కారుగా కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఈ కారు 15 సంవత్సరాలుగా కుటుంబంలో భాగంగా ఉంది. అబ్దుల్ నజీర్తో పాటు అతని కుమారుడు నియాజ్ అహ్మద్ ఈ కారును చాలా ఇష్టపడేవాడు.
ఈ కారుతో, అబ్దుల్ నజీర్ తన కొడుకు నియాజ్ కు కారు నడపడం నేర్పించాడు. అబ్దుల్ నజీర్ ఈ కారును 2007 లో కోజికోడ్కు చెందిన వ్యక్తికి రూ. 42 వేలకు అమ్మారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో పొడవైన సింగిల్ లేన్ ఫ్లైఓవర్, ఇదే
కారు అమ్మిన కొన్ని నెలల తర్వాత గుర్తుకు రావడం ప్రారంభమైంది. కారు విక్రయించిన సుమారు మూడు సంవత్సరాల తరువాత, కారును తిరిగి పొందాలనే కోరికను వ్యక్తం చేశాడు. వారి తండ్రి కోరికను నెరవేర్చిన నియాజ్, అప్పటికే అమ్మేసిన ఈ మారుతి 800 కారు కోసం అన్వేషణ ప్రారంభించాడు. నియాస్ కారు కొన్న వ్యక్తిని కలిశాడు. కానీ ఆ వ్యక్తి కారును వేరొకరికి అమ్మేశాడు.
కారు కొన్న వ్యక్తి కొట్టాయం కి చెందిన వాడిగా తెలుసుకున్నాడు. కానీ కారు కొనుగోలుదారుడి చిరునామా లేదా ఇతర సమాచారం అందుబాటులో లేదు. కానీ నియస్ పటు వదలకుండా కారు కొన్నవారి కోసం వెతుకుతూనే ఉన్నాడు.
MOST READ:వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సలహా ఇచ్చిన ముఖ్యమంత్రి ; అదేంటో తెలుసా ?
2019 చివరలో ఈ కారును త్రివేండ్రంకు చెందిన ఉమేష్ ఉపయోగిస్తున్నాడని తెలుసుకున్నాడు. నియాజ్ ఉమేష్ను వ్యక్తిగతంగా కలుసుకుని, మారుతి 800 తనకు కావాలని అమ్మమని చెప్పాడు. అయితే ఉమేష్ కారు అమ్మడానికి నిరాకరించారు. అయితే నియాస్ ఉమేష్తో సన్నిహితంగా ఉండటమే కాకుండా తనకు మరియు అతని కుటుంబానికి కారుతో ఉన్న సంబంధాన్ని గురించి చెప్పి ఒప్పించాడు.
చివరకు ఉమేష్ తమ వద్ద ఉన్న కారును అమ్మడానికి అంగీకరించాడు. గత నెలలో నియాజ్, ఉమేష్ కారును ఒక లక్ష రూపాయలు చెల్లించి కొనుక్కున్నాడు. తన తండ్రి 54 వ పుట్టినరోజు సందర్భంగా తన తండ్రి అబ్దుల్ నజీర్కు నియాజ్ ఈ మారుతి 800 కారును బహుమతిగా ఇచ్చాడు. దీనిపై కథనాన్ని మాతృభూమి నివేదించింది.
Source: Mathrubhumi
MOST READ:జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా