ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎందుకో తెలుసా

మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది లేదు అని ఇటీవల తమిళనాడుకి చెందిన వ్యక్తి మళ్ళీ ఋజువు చేసాడు. శరీరంలో అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏకంగా 10 గంటలు దాదాపు 165 కిలోమీటర్లు సైక్లింగ్ చేసాడు. ఈ సంఘటన గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం..

ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎలానో తెలుసా

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు. అతను తన న్యాయవాదికి కొన్ని ముఖ్యమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతం కరోనా వల్ల ప్రజా రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల తమిళనాడులోని తంజావూరు నుండి సైకిల్ ద్వారా మదురై చేరుకున్నారు.

ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎలానో తెలుసా

తంజావూరు జిల్లాలోని పిలియార్‌పట్టి గ్రామానికి చెందిన రాజా 1994 లో 14 సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదంలో ఎడమ కాలు కోల్పోయాడు. దీనికి పరిష్కారం కోరుతూ రాజా కోర్టులో దావా వేశారు. కానీ ఇప్పటివరకు వారికి ఎటువంటి పరిష్కారం లభించలేదు.

ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎలానో తెలుసా

రాజా తరచూ తంజావూరు నుండి మదురై వెళ్తున్నాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రజా రవాణా సేవలు నిలిపివేయబడ్డాయి. కానీ కేసు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అతడు కోర్టుకు వెళ్లి ముఖ్యమైన పత్రాలు దాఖలు చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా అతడు సైకిల్ ద్వారా మదురై వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. 10 గంటల ప్రయాణం తరువాత అతడు మదురై చేరుకున్నాము. ఈ సమయంలో అతను ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు.

ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎలానో తెలుసా

కరోనా మహమ్మరి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున తమిళనాడులో ప్రజా రవాణాను ప్రారంభించలేదు. అందుకే చాలా మందికి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో, ప్రజలు తమ అత్యవసర పనుల కోసం తమ సొంత బైక్‌లు, కార్లు మరియు సైకిళ్లను నడుపుతున్నారు.

ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎలానో తెలుసా

లాక్ డౌన్ ముగిసిన జూలై 31 న బస్సులు ప్రారంభించవచ్చని రాజా ఊహించారు. కానీ ఇప్పటిలో కరోనా లాక్ డౌన్ ముగిసే సంకేతాలు కనిపించలేదు. ఈ కారణంగా వారు సైకిల్ ద్వారా మదురై వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

ప్రమాదంలో ఒక కాలు కోల్పోయినప్పటికీ 165 కి.మీ సైక్లింగ్ చేసాడు, ఎలానో తెలుసా

రాజాకి ఇంతకుముందే సైక్లింగ్ అనుభవం ఉందని అందువల్ల ఎటువంటి సమస్య లేకుండా వెళ్లగలిగానని చెప్పాడు. అతను సైకిల్‌లో చాలా చోట్ల పర్యటించాడు. కర్ఫ్యూ సమయంలో, ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలో బయటకు వచ్చిన వారిని తమిళనాడు పోలీసులు పట్టుకోవడం ప్రారంభించారు కానీ ఇప్పుడు అది సడలించింది.

More from DriveSpark

Article Published On: Thursday, August 6, 2020, 11:16 [IST]
English summary
Specially abled person travels 165 kms with one leg. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+