తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 1,100 కి.మీ ప్రయాణించిన కొడుకు
కొంతమంది కొడుకులు వారి తల్లిదండ్రులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. ఈ విధంగా కొచ్చికి చెందిన రాహుల్ ఆర్ నాయర్ తన తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి సైకిల్ పై బెంగళూరు నుంచి కొచ్చికి వెళ్ళాడు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుదుకుందాం.

రాహుల్ ఆర్ నాయర్ కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో స్టార్టప్ కంపెనీని నడుపుతున్నాడు. అతను తన వాహనం ద్వారా కేరళలోని కొచ్చికి వెళ్లాలనుకున్నాడు. కానీ అతని డ్రైవింగ్ లైసెన్స్ 2 నెలల క్రితం ముగిసింది. కొచ్చికి వస్తామని తల్లిదండ్రులకు వాగ్దానం చేసినందున అతడు తమ పర్యటనను వాయిదా వేయడానికి ఇష్టపడలేదు.

అతను తల్లిదండ్రుల వైద్య చికిత్స చేయించడం కోసం తప్పకుండా కొచ్చి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు కేరళలో కరోనా పరిస్థితి కొంత సదాహరణ పరిస్థితికి చేరుకొని ప్రజా రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. అంతే కాకుండా అంతరాష్ట్ర ప్రయాణం కూడా సులభం అయింది.

కానీ రాహుల్ ఆర్ నాయర్ ప్రజా రవాణా ద్వారా ప్రయాణించడానికి నిరాకరించారు. కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందనే భయం దీనికి ప్రధాన కారణం. చివరకు రాహుల్ ఆర్ నాయర్ తన సైకిల్ ద్వారా కొచ్చి చేరుకున్నాడు.

నవంబర్ 18 న బెంగళూరు బయలుదేరిన రాహుల్ నాయర్ నవంబర్ 21 న కొచ్చిలోని తన ఇల్లు చేరుకున్నాడు. సైకిల్ పై ప్రయాణిఉంచి అతని తల్లిదండ్రులతో మాట్లాడాడు. నాయర్ తల్లిదండ్రులు కె రామచంద్రన్ నాయర్ మరియు మృణాలిని. తమ కొడుకు రాకతో రాహుల్ తల్లిదండ్రులు చాలా సంతోషించారు. కొచ్చిలో తన పని పూర్తి చేసిన తర్వాత రాహుల్ ఆర్ నాయర్ నవంబర్ 27 న సైకిల్ ద్వారా బెంగళూరుకు తిరిగి వచ్చారు.

మూడు రోజుల సైక్లింగ్ తరువాత, అతను బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరు నుండి కొచ్చి, కొచ్చి బెంగళూరు వరకు మొత్తం 1,100 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించాడు. ఇది అతనికి ప్రత్యేక అనుభూతిని కలిగించింది. రాహుల్ ఆర్ నాయర్ సైక్లింగ్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతాడు.

అతను బెంగళూరులో టూ వీల్స్ మరియు హ్యాండిల్ బార్ అనే స్టార్టప్ కంపెనీని నడుపుతున్నాడు. దీని ద్వారా సైక్లింగ్ గురించి ప్రజలకు కూడా తెలుపుతూ ఉంటాడు. రాహుల్ ఆర్ నాయర్ స్వయంగా సైక్లింగ్ చేయడం ఇదే మొదటిసారి. లాక్డౌన్ సమయంలో చాలా మంది సైకిల్ ద్వారా వేలాది మైళ్ళు ప్రయాణించారు. తమ ఊరు చేరుకోవడానికి ప్రజా రవాణా అవసరం లేనందున ఉద్యోగాలు కోల్పోయిన వారు సైకిల్లో ప్రయాణించారు.

ఇంతకు ముందు చెప్పినట్లుగా, భారతదేశంలో ప్రజా రవాణా సాధారణ స్థితికి చేరుకుంది. సైకిల్ ద్వారా వేలాది కిలోమీటర్లు ప్రయాణించడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవం. చాలా మంది ప్రజలు సైకిల్ ద్వారా లాంగ్ రైడ్ నడుపుతారు. ఈ చిత్రాలు టూ వీల్స్ మరియు హ్యాండిల్ బార్ నుండి తీసుకోబడ్డాయి.


Click it and Unblock the Notifications








