Vande Bharat వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి.. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది.. కావాలనే చేస్తున్నారా?

దేశ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. రైల్వే రంగంలో ఒక విప్లవాత్మక అడుగు. ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడంలో ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు కీలకం కానున్నాయి. అయితే వందే భారత్‌ రైళ్లు మాత్రం మొదటి నుంచి పరీక్షలను ఎదుర్కొంటోంది.

వందే భారత్‌ రైళ్లను ప్రారంభించినప్పటి నుంచి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. రైళ్ల క్వాలిటీ, పనితీరుపై నెటిజన్ల నుంచి విభిన్న రకాల కామెంట్లు వస్తున్నాయి. అదే విధంగా ప్రతిపక్షాలు సైతం వందే భారత్‌ రైళ్లలోని పరిస్థితిని వివరిస్తూ సామాజిక మధ్యమాల్లో విమర్శలు వెల్లగక్కుతున్నాయి.

Vande-Bharat-Express

తాజాగా వందే భారత్‌ రైలు లోపల వర్షపు నీరు కారుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ఇది వందే భారత్ రైలు కాదని సంబంధిత రైల్వే శాఖ స్పష్టం చేసింది. దీని తర్వాత, వందే భారత్ రైలును సాధారణ రైలు ఇంజిన్‌తో లాగిన వీడియో కూడా చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా తీవ్రంగా ట్రోల్స్‌కు గురయింది. దీనిపై స్పందించిన ఆ శాఖ ట్రయల్ రన్‌లో వీడియో తీశామని స్పష్టం చేసింది.

కొత్త వందే భారత్ రైలును ట్రాక్‌పైకి తీసుకురావడానికి, దాని ట్రాక్‌లను పరిశీలించడానికి ట్రయల్‌ రన్‌ జరుగుతుంది. ఆ సమయంలో అందులో ప్రయాణికులెవరూ లేరని సంబంధిత రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఇవి కాకుండా జంతువులు పట్టాలు దాటుతూ ఢీకొనడం వల్ల రైలు దెబ్బతినడంతో వందే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీటన్నింటికి రైల్వే శాఖ స్పందించి వివరణ ఇచ్చింది.

దావణగెరెలో రాళ్ల దాడి : జూన్ 27న ప్రధాని నరేంద్ర మోదీ ధార్వాడ్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించారు. ఈ రైలుపై జూలై 1 న దావణగెరె రైల్వే స్టేషన్ సమీపంలో రాళ్ల దాడి జరిగింది. సీ4 కిటికీకి దెబ్బ తగిలిందని, ప్రయాణికుల్లో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదని సమాచారం.

కేఎస్‌ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్‌కు వెళ్లే రైలు శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో దావణగెరె రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వందేభారత్ రైలుపై గతంలోనూ పలుమార్లు రాళ్ల దాడి జరిగింది.

ఈ తరహా సంఘటనలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) జనవరిలో 21 కేసులు, ఫిబ్రవరిలో 13 కేసులు నమోదు చేసింది. ఫిబ్రవరి 25న మైసూరు - చెన్నై వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. రెండు రైలు అద్దాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గ్లాస్ మరియు కోచ్ నాణ్యత కారణంగా ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.

ఇటీవల కర్ణాటకలోనే కాకుండా డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ రైలు ముజఫర్ నగర్ స్టేషన్ వైపు వెళుతుండగా రాళ్ల దాడి జరిగింది. అదేవిధంగా భోపాల్ - ఢిల్లీ వందే భారత్ రైలుపై కూడా రాళ్ల దాడి జరిగింది. ఈ తరహా ఘటనలు ఎక్కువ అవుతుండటంతో సౌత్ వెస్ట్రన్ రైల్వే దీనిపై తీవ్రంగా దృష్టి సారించింది. సీరియస్ యాక్షన్‌ తీసుకునేందుకు ఇలాంటి చర్యలను నివారించడానికి ఆర్‌పీఎఫ్ అధికారులను రైళ్లలో మోహరించింది.

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే ఆ నష్టం ప్రజల మీదనే పడుతుంది కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండటం, బాధ్యతగా వ్యవహరించడం చాలా అవసరం. వేలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తారు. ఇలా రైళ్లపై దాడికి పాల్పడటం ద్వారా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని గుర్తుంచుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, July 3, 2023, 17:24 [IST]
English summary
Stone pelting on newly launched vande bharat express in karnataka
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+