Just In
- 2 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 3 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 5 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Movies Mrunal Thakur గ్లామర్తో అదరగొట్టిన మృణాల్ థాకూర్.. హిరామండి షోలో స్పెషల్ ఎట్రాక్షన్గా
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
స్వామీజీని తాకిన పేస్ మాస్క్ ఎఫెక్ట్.. ఎలా అనుకుంటున్నారా?
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తూ ఎంతోమంది ప్రాణాలను హరిస్తోంది. ఈ సమయంలో ఈ మహమ్మారిని నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించి, సామజిక దూరాన్ని పాటించాలి.
ప్రభుత్వం నిర్ణయించిన ఈ నియమాలను ఉల్లంఘిస్తే ఎంతవారికైనా జరినామా తప్పదు. ఇటీవల విధుల్లో ఉన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ పేస్ మాస్క్ ధరించనందుకు అతనికి జరిమానా విధించారని సంఘటనను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మధ్యప్రదేశ్లోని టామో కేంద్రంగా పనిచేస్తున్న అయోధ్య రామ్ జెన్బుమి నిర్మన్ ట్రస్ట్ జాతీయ ఉపాధ్యక్షుడు స్వామి ఆత్మానంద సరస్వతి పేస్ మాస్క్ ధరించకుండా గుర్తించబడ్డాడు.
స్వామి ఆత్మానంద సరస్వతి ఫేస్ మాస్క్ ధరించకుండా బహిరంగ రహదారిపై మహీంద్రా ఎక్స్వి 500 కారులో ప్రయాణిస్తూ గుర్తించబడ్డాడు. పోలీసులు అతని వాహనాన్ని అడ్డుకుని ఫేస్మాస్క్ ధరించమని చెప్పారు. అతను ఫేస్ మాస్క్ ధరించడానికి నిరాకరించాడు. అంతే కాకుండా విచిత్రమైన సమాధానం ఇచ్చాడు.
మనల్ని మనం రక్షించుకోవాలి అని ప్రధాని మోడీ అన్నారు. నేను చేస్తున్నది అదే. ఫేస్మాస్క్ ధరించడం వాళ్ళ నాకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబందిగా ఉంటుందని కూడా చెప్పాడు. పేస్ మాస్క్ ధరించడం వల్ల నాకు ఏదైనా ఇబ్బంది కలిగితే కచ్చితంగా మీరే బాధ్యత వహిస్తారు అని చెప్పాడు.
ఈ కారణంగా నేను ఫేస్మాస్క్ ధరించనని చెప్పాడు. ఫేస్మాస్క్ ధరించాలని పోలీసులు పలుమార్లు కోరారు. కానీ వారు తమ మొండితనం వదిలిపెట్టలేదు. దీనితో పోలీసులు అతనికి జరిమానా విధించారు. భారతదేశంలో కోవిడ్ 19 వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోజూ మూడు లక్షల కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి.
MOST READ:విడుదలైన మహీంద్రా 2021 ఏప్రిల్ సేల్స్.. స్వల్పంగా పెరిగిన వృద్ధి
వైరస్ వల్ల మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ పరిస్థితిలో తమను తాము రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. కానీ కొంతమంది ఫేస్మాస్క్ ధరించడం అడ్డంకిగా భావిస్తారు. కానీ ఫేస్ మాస్క్ ధరించడం గతంలో కంటే ఇప్పుడు చాలా అవసరం.
వాహనంలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు కూడా తప్పనిసరిగా పేస్ మాస్క్ ధరించాలి. లేకుంటే వీరికి కూడా పోలీసులు జరిమానా విధిస్తారు. ప్రస్తుతమున్న ఈ సమయంలో పేస్ మాస్క్ నిజంగా శ్రీరామ రక్ష, కావున ప్రజలు విధిగా పేస్ మాస్క్ ధరించాలి.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ లో తప్పకుండా పాటించాల్సిన రూల్స్, ఇవే
ప్రజలు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఫేస్మాస్క్ ధరించడం తప్పనిసరి. వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు కూడా ఫేస్మాస్క్ ధరించడం తప్పనిసరి. అయినప్పటికీ, చాలా మంది ఫేస్ మాస్క్ ధరించడానికి వెనుకాడతారు. ఫలితంగా, కరోనావైరస్ సంక్రమణ గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఈ పరిస్థితి కొనసాగితే పరిస్థితి మరింత దిగజారిపోతుందని భారత్ ఆందోళన చెందుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఫేస్మాస్క్ ధరించకుండా రోడ్డుపైకి వచ్చిన వారు ఎంతటి వారిన వారికి జరిమానా విధిస్తున్నారు.
MOST READ:2021 ఏప్రిల్ నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాల హవా
ప్రజలు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు సరైన భద్రతా చర్యలను అనుసరిస్తున్నారా లేదా అనే దానిపై పర్యవేక్షణ జరుగుతోంది. ప్రస్తతం ప్రభుత్వంలోని ఉన్నతాధికారుల నుండి కొంతమంది సిబ్బంది కరోనా వైరస్ నియంత్రణ నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది.
ఫేస్ మాస్క్ ధరించని ప్రతి ఒక్కరికి జరిమానా విధించబడుతుంది. ఫేస్ మాస్క్ ధరించకుండా కారులో ప్రయాణిస్తున్న స్వామీజీ, పోలీసులు అతనిని ప్రశ్నించడంతో సోషల్ నెట్వర్క్లో వైరల్ అయ్యింది. ఏది ఏమైనా ఈ మహంతి బారినుంచి బయటపడటానికి ఫేస్ మాస్క్ అవసరం. దీనిని అందరూ దృష్టిలో ఉంచుకోవాలి.
Image Courtesy: Cobrapost