Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 16 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?
ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో చాలామంది సెలబ్రెటీలు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తున్నారు, మొన్న తెలుగు స్టార్స్, నిన్న కన్నడ స్టార్స్, ఇప్పుడు ఈ జాబితాలోకి తమిళ్ స్టార్స్ కూడా. ఇటీవల తమిళ్ బిగ్ బాస్ సెలబ్రిటీ "రమ్య పాండియన్" ప్రముఖ లగ్జరీ కారు అయిన బిఎమ్డబ్ల్యూ జిటిని కొనుగులు చేసినట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
రమ్య పాండియన్ 'జోకర్' అనే తమిళ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తర్వాత రమ్య పాండియన్ పెద్దగా కనిపించకపోయినా, తమిళ సినీ అభిమానుల మనస్సుల్లో మాత్రం సన్నిహిత స్థానం పొందింది. రమ్య పాండియన్ తరువాత కాలంలో 'ఆన్ దేవతై' చిత్రంలో కొంత విభిన్నమైన పాత్రలో నటించి తనకంటూ ఒక గుర్తింపు పొందింది.
తరువాత ప్రసిద్ధ ప్రైవేట్ టీవీ షోల ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యింది. రమ్య బిగ్ బాస్ మరియు ఇతర షోల ద్వారా చాలా మంది యువకుల మరియు గృహిణుల మనస్సులను ఆకర్శించింది. అంతే కాకుండా రమ్య పాండియన్ వంట కార్యక్రమంలో పోటీదారుగా, కుకు విత్ కోమలీతో పాటు పుగాజ్ మరియు కామెడీ టెలివిజన్ షో కలక్క పోవతు యారులో న్యాయమూర్తిగా నటించి బాగా ఫెమస్ అయ్యింది.
MOST READ:ల్యాండ్ రోవర్పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
ఇదిలా ఉండగా ఇటీవల రమ్య పాండియన్ ఖరీదైన బిఎమ్డబ్ల్యూ జిటి లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు 'పరసు పాండియన్' తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా పంచుకున్నారు.
రమ్య పాండియన్ బిఎమ్డబ్ల్యూ 5 సిరీస్ గ్రాన్ టురిస్మో మోడల్ యొక్కఓల్డ్ వెర్షన్ కారుని కొనుగోలు చేసింది. ఈ లగ్జరీ కారు ధర రూ. 50 లక్షలకు పైగా ఉంటుంది. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
MOST READ:2021 టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రివ్యూ.. భారత మార్కెట్లో పవర్పుల్ ఎస్యూవీ
బీఎండబ్ల్యూ యొక్క హై-ఎండ్ వేరియంట్లు అత్యధిక ధరకు అమ్ముడవుతాయి, ప్రస్తుతం రమ్య పాండియన్ ఏ వేరియంట్ను కొనుగోలు చేసింది అనేదాని గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. అందువల్ల ఈ కారు యొక్క కచ్చితమైన ధర, ఫీచర్స్ మరియు ఇంజిన్ వివరాలను చెప్పలేము.
రమ్య పాండియన్ బీఎండబ్ల్యూ కారు కొన్న విషయం మాత్రం, ఆమె సోదరుడు పరసు పాండియన్ చేసిన పోస్ట్ వల్ల తెలిసింది. రమ్య పాండియన్ 2011 లో ఎక్కువగా సిటీ బస్సులో ప్రయాణించింది. అయితే ఈ 2021 లో బీఎండబ్ల్యూ లగ్జరీ కారును కొనుగోలుచేసింది.
MOST READ:నైట్ కర్ఫ్యూ; ఒక్కరోజులో 68 వాహనాల స్వాధీనం.. ఎక్కడో తెలుసా?
రమ్య పాండియన్ సోదరుడు గర్వంగా ఈ సమాచారాన్ని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసాడు. అంతే కాకుండా ఎప్పుడూ మంచికి మంచి జరుగుతుందని పరసు పాండియన్ తన పోస్ట్లో హ్యాష్ట్యాగ్ కూడా పెట్టారు. రమ్య పాండియన్ యొక్క అభివృద్ధి చాలా మంది యువతులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె సోదరుడు అన్నాడు.
ఏది ఏమైనా సిటీ బస్సు ప్రయాణం నుంచి సొంత కారు కొనే స్థాయికి ఎదగటం అనేది ఒక్కరోజులో జరిగే పని కాదు, దాని వెనుక ఉన్న శ్రమ ఏమిటో శ్రమించే వారికే తెలుస్తుంది. ఇలాంటివి ఆదర్శంగా తీసుకుని నేటి యువత మరింత ముందుకు సాగాలి.
MOST READ:చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!