ప్రమాదంలో చిక్కుకున్న పళనిస్వామి కాన్వాయ్లోని కార్.. ఎలా జరిగిందంటే ?
ప్రపంచంలో ఎక్కువ రోడ్డుపరమాదాలు జరుగుతున్న దేశాలలో మన భారతదేశం కూడా ఉంది. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం సుమారు 1.50 లక్షల మందికిపైగా మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం.

వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాదు. మితినీరైనా వేగంతో వెళ్లే వాహనాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఈ కారణంగా పరిమితవేయగముకంటె ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలకు పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠినమైన నిబంధనలను అమలుచేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. భారతీయ రహదారులపై ఏ నిముషం ఏమి జరుగుతుందో ఊహించలేకపొతున్నారు. ట్రాఫిక్ నియమాలను ఏమాత్రం లెక్కచేయకుండా చాలామంది వాహనదారులు రోడ్డుప్రమాదాలకు కారణమవుతున్నారు.

రోడ్డుపైన వెళ్ళేటప్పుడు అకస్మాత్తుగా పశువులు లేదా కొంతమంది ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాహనాలు అధికవేగంతో ప్రయాణించేటప్పుడు వెంటనే వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోతారు. అప్పుడు ఊహకి అందని ప్రమాదాలు జరుగుతాయి.

అధిక వేగంతో వచ్చే వాహనాల వల్ల జరిగే ప్రమాదాల గురించి అందరికి తెలుసు. కానీ ఏకంగా అధికవేగంతో ప్రయాణించి ఒక ముఖ్యమంత్రి ఎస్కార్ట్ వాహనాలకె ప్రమాదం జరగటం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన సంఘటనే అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే, తమిళనాడు రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ తమ ప్రచారాలను చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా పర్యటనలో ఉన్నారు. తూత్తుకుడి జిల్లాలో జనవరి 4 న ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారాన్ని పూర్తి చేసిన తరువాత, తిరునెల్వేలి జిల్లాలోని చెరన్మఖాదేవి సన్నీధికి వెళుతున్నాడు. ముఖ్యమంత్రి భద్రతలో పోలీస్ వాహనాలు చుట్టూ వస్తున్నాయి.

సాధారణంగా ఒక రాష్ట్ర ఏవిధమైన భద్రత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అంత భద్రతలో వస్తున్న ముఖ్యమంత్రి ఎస్కార్ట్ వేగంగా వస్తుండటంతో మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు యొక్క ముందుభాగం ఎక్కువగా దెబ్బతినింది. మరో కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్పైకి ఎక్కింది.

తూత్తుకుడి జిల్లాలోని వల్లనాడ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి పళనిస్వామి కారుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. కార్లు ఎక్కువగా దెబ్బతిన్నప్పటికీ అందులోని వారు ప్రాణాలతో బయటపడగలిగారు.

ప్రమాదం జరిగిన సంఘటన యొక్క వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం మితిమీరిన వేగం అని అర్థమవుతోంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వీలైనంతవరకు వేగంగా వెళ్ళకపోవడం మంచిది. కొన్ని కారణాల వల్ల కొంతమంది వాహనదారులు చాలా వేగంగా వెళ్తారు.
వాహనదారులు ఒకవేళ సుదూరప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు లేదా త్వరగా చేరుకోవాలనుకున్నప్పుడు ముందుగా బయలుదేరటం మంచిది. ఇది గమ్యా నికి సరైన సమయంలో తీసుకువెళ్లడమే కాకుండా, వేగాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి.

వాహనం హైవే మీద వెళ్ళేటపుడు ఎంత వేగంగా వెళ్తుంది స్పీడోమీటర్ను కూడా చూసుకోవడం మంచిది. అంతే కాకుండా వెళ్లే రోడ్డుపై కూడా శ్రద్ధ వహించాలి. కొన్నిసార్లు వాహనదారులు మద్యం తాగి డ్రైవ్ చేస్తారు. మద్యం తాగి డ్రైవ్ చేయడం ప్రమాదం మాత్రమే కాదు, ప్రాణాంతకం కూడా.


Click it and Unblock the Notifications








