పెట్రోల్ బంక్లో కొత్త రూల్.. అది ఉంటేనే ఇకపై పెట్రోల్
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విజృంభిస్తోంది. ఈ కరోనా మహాహమ్మరి ఎంతోమంది ప్రజలను పట్టిపీడిస్తోంది. కరోనా కేసులు కూడా రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో కరోనా నివారణకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక ఆంక్షలను విధించాయి. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని నివారించడంలో ఫేస్ మాస్క్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. కావున ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ తప్పనిసరిగా పేస్ మాస్క్ ధరించాలి.

కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఈ సమయంలో కూడా చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేస్ మాస్క్ వంటివి ధరించరు. ఇది మరింత వేగంగా కరోనా వ్యాపించడానికి కారణమవుతుంది. అయితే ఇటీవల ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్క్ ధరించేలా చేయడానికి తమిళనాడు పెట్రోలియం మర్చంట్స్ అసోసియేషన్ కొత్త రూల్స్ ప్రకటించింది.

కొత్తగా విడుదలైన ఈ రూల్స్ ప్రకారం, పెట్రోల్ బంకర్ల వద్దకు వచ్చే ప్రతి కస్టమర్ ఫేస్ మాస్క్ తప్పకుండా ధరించి ఉండాలి, ఫేస్ మాస్క్ ధరించని వినియోగదారులకు పెట్రోల్ మరియు డీజిల్ ఇవ్వబడదని ఖచ్చితంగా తెలియజేసారు. ఇది 2021 ఏప్రిల్ 10 నుండి అమలులోకి వస్తుంది. ఏప్రిల్ 10 నుంచి తమిళనాడు పెట్రోల్ బాకులు వెళ్లే ప్రతి వాహనదారుడు తప్పకుండా ఫేస్ మాస్క్ ధరించాలి.

ఇది మాత్రమే కాకుండా ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం, కారులో ఒంటరిగా ప్రయాణించే వారికి కూడా ఫేస్ మాస్క్లు తప్పనిసరి అని తెలిపింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఫేస్ మాస్క్ ధరించని వారికి ఢిల్లీ పోలీసులు భారీగా జరిమానా విధించారు.

దీనికి వ్యతిరేకంగా కారులో ఒంటరిగా ప్రయాణించే వారికి ఫేస్ మాస్క్ ఎందుకు అని ప్రశ్నించారు. అయితే, కారులో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు కూడా ఫేస్ మాస్క్ ధరించడం ఇప్పటి పరిస్థితిలో చాలా అవసరం అని హైకోర్టు తీర్పునిచ్చింది.

అంతే కాకుండా ప్రస్తుతం కరోనా అధికంగా వ్యాపిస్తున్న సమయంలో ఫేస్ మాస్క్ ధరించాల్సిన అవసరాన్ని కూడా తెలిపారు. కావున ప్రస్తుతం ఫేస్ మాస్క్ ధరించని వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ కఠినమైన చర్యలను నివారించడానికి ఫేస్ మాస్క్ ధరించడం ఇప్పుడు చాలా వరకు శ్రేయస్కరం.

హెల్మెట్ ధరించని వారికి పెట్రోల్ జారీ చేయబోమని గతంలో కూడా ప్రకటించారు, కానీ దీనిని పూర్తిగా పాటించలేదు. కరోనా వైరస్ నుండి రక్షించడానికి ఫేస్ మాస్క్ వలె, హెల్మెట్ రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులను రక్షిస్తుంది. హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని గుర్తించిన హెల్మెట్ ధరించకపోతే పెట్రోల్ ఇవ్వబోమని కూడా ప్రకటించారు.

ఫేస్ మాస్క్ ధరించకపోతే పెట్రోల్, డీజిల్ జారీ చేయబోమని ఇప్పుడు ప్రకటించారు. ఫేస్ మాస్క్ తో పాటు హెల్మెట్ తప్పనిసరి అవునా కాదా అని పెట్రోలియం మర్చంట్స్ అసోసియేషన్ తెలుపలేదు, దాని గురించి సమాచారం త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇలాంటి ఆసక్తికమైన విషయాలను తెలుసుకోవడానికి మా 'డ్రైవ్స్పార్క్' ఛానల్ సందర్శించండి.


Click it and Unblock the Notifications








