ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?
భారతదేశంలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రజలు మరణించారు. అంతే కాకుండా ఈ వైరస్ బారిన పడిన ప్రజల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ తరుణంలో ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో రోజులు హాస్పిటల్స్ కి వెళ్ళడానికి అవసరమైన అంబులెన్సులు అందుబాటులో లేదు. ప్రస్తుతం దేశంలో అంబులెన్సులు కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి కష్ట సమయంలో చాలామంది యువకులు తమ కార్లను అంబులెన్సులాగా మార్చి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లు కూడా తమ ఆటోలను కరోనా బాధితుల ఉపయోగార్థం వినియోగిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మహేంద్రన్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తన కారును అంబులెన్స్గా మార్చి అక్కడి ప్రజలకు ఉచితంగా సర్వీస్ చేస్తున్నాడు. మనదేశంలో అంబులెన్సుల కొరత ఎక్కువగా ఉంది. కావున ప్రైవేట్ అంబులెన్సుల హవా ఎక్కువైంది.

అత్యవసర సమయంలో ప్రైవేట్ అంబులెన్సులు వినియోగిస్తే సాధారణ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇలాంటి కేసులు కరోనా సమయంలో లెక్కకు మించి జరిగాయి. దీనికి సంబంధించిన చాలా సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అంతే కాకుండా ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు.

ఇలాంటి దుర్భర పరిస్థితిలో తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని, తన కారుని అంబులెన్స్గా మార్చి ప్రజల సౌకర్యార్థం వినియోగిస్తున్నారు. ఆ నాయకుడు అంబులెన్స్ వ్యాన్ కొనాలని అనుకున్నాడు, కానీ దానికి దాదాపు కనీసం 5 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, దానికి బదులుగా తన కారునే అంబులెన్స్గా మార్చాలని అనుకున్నాను.

ఈ కారులో రోగికి అవసరమైన ఆక్సిజన్ సిలిండర్ వంటివి కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలను నగర ఆసుపత్రికి తీసుకురావడంలో పెద్ద సమస్య ఉంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మహేంద్రన్ తన కారును అంబులెన్స్గా మార్చి వినియోగిస్తున్నారు.

ప్రైవేట్ అంబులెన్స్ మరియు టాక్సీలు ఎక్కువ మొత్తం డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది సామాన్య ప్రజలపై ఎక్కువ భారాన్ని కలిగిస్తుంది. దీని వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఒక మహిళ హాస్పిటల్ కి రావడానికి కనీస సౌకర్యం లేకపోవడంతో మరణించింది.

ఇది మాత్రమే కాకుండా కొద్ది రోజుల క్రితం, పుదుచ్చేరి నగరం నుండి తీసుకెళ్లడానికి 180 కిలోమీటర్ల ప్రయాణానికి ఒక కుటుంబం రూ. 15 వేలు చెల్లించాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఇప్పుడు అవసరమైన సమయాల్లో మహేంద్రన్ కారును ఉపయోగించవచ్చు.

గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు ఈ కారు అంబులెన్స్ను ఉచితంగా ఉపయోగించవచ్చని అతడు చెప్పాడు. ఈ సమయంలో ఆ కారుని డ్రైవ్ చేయడానికి ఆ గ్రామానికి చెందిన 28 ఏళ్ల వ్యక్తి ముందుకు వచ్చాడు. అతని కోసం పిపిఇ కిట్లు, స్పెషల్ రూమ్ వంటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

మహేంద్రన్ ఈ ప్రణాళికను కాంగ్రెస్ ఎమ్మెల్యేతో పంచుకున్నారు. ఇప్పుడు అతను మరో రెండు ప్రైవేట్ వాహనాలను ఏర్పాటు హేయడంలో నిమగ్నమై ఉన్నాడు. ఇవన్నీ ప్రజలను ఆసుపత్రికి ఉచితంగా తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం దేశంలోని నాయకులందరూ ముందుకు వచ్చి ఈ విధంగా సహాయం చేస్తే అంబులెన్సులు కొరత అనేదే ఉండదు.


Click it and Unblock the Notifications








