Just In
- 5 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 6 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 9 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 10 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మీకు తెలుసా.. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం, ఇదే
భారతీయ రోడ్లపై పెరుగుతున్న ట్రాఫిక్ మరియు ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో వాహనదారులను దెబ్బతీశాయి. వాహనదారుల నిర్లక్ష్యం ప్రమాదాలకు ప్రధాన కారణం. అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కూడా ప్రమాదాలకు కారణమవుతోంది.
ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా, రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని ప్రతి మూలలో ప్రతిరోజూ లెక్కకు మించిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ కారణంగానే మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది.
ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక ప్రాణనష్టం జరిగిన వాటిలో భారత్ కూడా ఉంది. భారతదేశ జాతీయ రహదారిపై అత్యధిక ప్రమాదాలు జరిగే రాష్ట్రాల జాబితా ప్రతి సంవత్సరం ప్రచురించబడుతుంది.
జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాల జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎనిమిది లేన్ మరియు నాలుగు లేన్ రోడ్లు మరియు రహదారి వెడల్పు పనులను నిర్మిస్తున్నప్పటికీ తమిళనాడు మొదటి స్థానంలో ఉంది అనేది ఆశ్చర్యకరమైన వాస్తవం.
MOST READ:ఎమ్జి గ్లోస్టర్ వేరియంట్స్ మరియు ఫీచర్స్.. ఎలా వున్నాయో చూసారా!
తాజా అధ్యయనం ప్రకారం, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై 5,489 ప్రదేశాలు అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. అందులో 748 ప్రదేశాలు తమిళనాడులో ఉన్నాయి.
ఈ సంఖ్య దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ. కేంద్రపాలిత ప్రాంతాలలో జరిగిన ఘోర ప్రమాదాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీలో 113 ప్రమాద ప్రాంతాలను గుర్తించారు. ఈ సమాచారం అంతా రాష్ట్రాల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ప్రచురించబడుతుంది.
MOST READ:గుడ్ న్యూస్.. థార్ యాక్సెసరీస్ ప్యాక్ వెల్లడించిన మహీంద్రా
ప్రమాద ప్రాంతం ఎలా గుర్తించబడుతుందంటే?
జాతీయ రహదారి యొక్క ఒక నిర్దిష్ట విభాగంలో జరిగే ప్రమాదాల ఆధారంగా లేదా నిర్దిష్ట ప్రాంతంలో సంభవించే 10 కంటే ఎక్కువ మరణాల ఆధారంగా ప్రమాద ప్రాంతాలు గుర్తించబడతాయి. ఇందులో భాగంగా గుర్తించిన 748 ప్రదేశాలు తమిళనాడులో ఉన్నాయి.
దీనికి సంబంధించిన గణాంకాల ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో జాతీయ రహదారులపై ప్రతి 500 మీటర్లకు కనీసం 5 ఘోర ప్రమాదాలు జరిగాయి. కొన్ని రాష్ట్రాలు అందించిన గణాంకాలు తప్పు అని చెబుతారు. ఇందులో కూడా మహారాష్ట్రలో 25, హర్యానాలో 23, బీహార్లో 92 ప్రాంతాలు మాత్రమే అధిక ప్రమాద ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి.
MOST READ:టయోటా హిలక్స్ వుడ్ స్కేల్ మోడల్.. ఇది నిజంగా సూపర్ గురూ..!
దీనిపై స్పందించిన రోడ్డు రవాణా, రహదారుల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సమాచారం సరికాదని అన్నారు. ఆ రాష్ట్రాల పోలీసులు అందించిన డేటాలో తేడా ఉందని అన్నారు.
కేసు రికార్డుతో మాత్రమే పోలీసులు సమాచారం అందించగలరని అధికారుల అభిప్రాయం. తమిళనాడు మాత్రమే కాదు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లో కూడా ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు మనకు తెలుస్తోంది. రహదారి భద్రతను పెంచడానికి మరియు ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల విభాగం పార్లమెంటుకు తెలిపింది.
MOST READ:పేద దేశానికీ సహాయం చేయడానికి 36 రోజులు సైక్లింగ్ చేసిన యువకుడు.. ఇంతకీ ఏంటో ఈ కథ తెలుసా ?