ఆటో & టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

భారతదేశంలో కరోనా కారణంగా ఇబ్బందుల్లో ఉన్న ఆటో, టాక్సీ డ్రైవర్ల సహాయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు రూ. 10,000 అందిస్తుంది. దీని గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

సంక్షేమ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2.62 లక్షల ఆటో, టాక్సీ డ్రైవర్లను ఈ సహాయాన్ని అందించనుంది. జిల్లా అధికారులు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి "వైఎస్‌ఆర్ వాహన మిత్ర" పథకం కింద మొత్తం రూ. 2262.49 కోట్లు 2,62,493 లబ్ధిదారులకు బదిలీ చేయనున్నట్లు ప్రకటించారు.

ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

ఈ డబ్బును మద్యం వినియోగం కోసం కాకుండా తమకు, వారి కుటుంబాలకు జీవిత నిర్వహణ కోసం ఉపయోగించాలని లబ్ధిదారులు అభ్యర్థించారు. ఈ డబ్బును మద్యం తాగి డ్రైవ్ చేయడానికి ఉపయీగించినట్లైతే, ఇది ప్రయాణీకులకు మరియు డ్రైవర్లకు సమస్యలను కలిగిస్తుందని ఆయన అన్నారు.

ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు భీమా ప్రీమియంలు, లైసెన్స్ ఫీజులు మరియు ఇతర ఖర్చులు చెల్లించడంలో సహాయపడటానికి ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు రూ. 10,000 చెల్లింపును అందించడానికి వైయస్ఆర్ వాహన్ మిత్ర పథకాన్ని 2019 అక్టోబర్ 4 న ప్రారంభించారు.

ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

వైఎస్‌ఆర్ వాహన్ మిత్రా పథకం కింద నాలుగు నెలల ముందస్తు భత్యం ఆటో, టాక్సీ డ్రైవర్లకు గత రెండు నెలలుగా ఆదాయం లేకుండా ఇవ్వబడింది. ఇది వాహనదారులు ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది.

ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ గ్రామంతో లేదా వార్డ్ కార్యదర్శితో సమావేశమై ఈ ప్రాజెక్టుకు అర్హత ప్రమాణాలను సమీక్షించాలి. ఆర్థిక సహాయానికి అర్హత ఉన్నవారు మరియు ఇంకా నిధులు రాలేని వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ ప్రభుత్వం, ఏంటో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. అర్హత కలిగిన ఆటో, టాక్సీ డ్రైవర్లందరికీ జూలై 4 లోగా ఈ మొత్తం డబ్బు చెల్లించబడుతుందని తెలిపారు. ఈ కరోనా సంమయంలో ఇలాంటి సహాయం ప్రకటించడం నిజంగా హర్షించదగ్గ విషయమే. ఇది ఆటో మరియు టాక్సీ డ్రైవర్లకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Sunday, June 7, 2020, 13:30 [IST]
English summary
Taxi Auto Rickshaw Drivers to receive Rs 10000 allowance from AP State Government. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+