ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించడం వల్ల 2020 మార్చి 24 నుంచి ఇప్పటికీ లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ కరోనా మహమ్మారి వ్యాపించకూడదని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రస్తుతం మన దేశంలో లాక్ డౌన్ మూడవ దశ కొనసాగుతోంది. ఈ లాక్ డౌన్ మూడవ దశ ప్రస్తుతం మే 17 వరకు అమలులో ఉంటుంది. కానీ నేడు భారతదేశంలో ఉన్న పరిస్థితితులు చూస్తుంటే ఈ లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల రవాణా సేవలు నిలిచిపోయాయి.

ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

కరోనా లాక్ డౌన్ కారణంగా క్యాబ్ డ్రైవర్లు నిరుద్యోగులుగా మారుతున్నారు. టాక్సీని నమ్ముకుని జీవించే టాక్సీ డ్రైవర్ ఫేస్ మాస్క్‌లను అమ్ముతున్నాడు. మాస్కులు అమ్మడంతో జీవనం సాగిస్తున్నాడు. లాక్ డౌన్ కాలంలో మాస్కులు విక్రయించిన వ్యక్తి కేరళలోని ఎర్నాకుళంలో ఉన్న జిజో అనే టాక్సీ డ్రైవర్. ఇందుకోసం అతడు తమ కారును మొబైల్ స్టోర్‌గా మార్చారు.

ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

మీడియా వర్గాల సమాచారం ప్రకారం, వారు ప్రతి నెలా తమ కారుకు రూ. 9500 ఇఎంఐ చెల్లిస్తున్నారు. అదనంగా అతని కుటుంబపోషణకు, నిత్యావసర వస్తువుల కోసం ఈ పేస్ మాస్కులు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.

ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

ప్రస్తుత పరిస్థితుల్లో టాక్సీ డ్రైవింగ్ సంపాదన లేని కారణంగా ఈ విధంగా చేయడం మొదలుపెట్టాడు. తన కుటుంబాన్ని పోషించడానికి మాస్కులు అమ్ముతున్నానని, నా లాంటి ఇతర క్యాబ్ డ్రైవర్లు వేర్వేరు పనులు చేస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

జిజో యొక్క భార్య, ఇద్దరు పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు అందరూ అతనిపైనే ఆధారపడి ఉంటుంది. వారిని పోషించడానికి టాక్సీ నడపడానికి బదులుగా, వారు ఫేస్ మాస్క్‌లను విక్రయించే పనిలో ఉన్నారు. మూడవదశ లాక్ డౌన్ లో కొన్ని వ్యాపారాలకు మినహాయింపు ఉన్నప్పటికీ, ప్రజా రవాణాకు ఇంకా అనుమతి లభించలేదు.

ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

ప్రస్తుతం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సేవలను భారతదేశం అంతటా ప్రారంభించడానికి అనుమతి ఉంది. రెడ్ జోన్‌లో క్యాబ్ సేవలు అనుమతించబడవు. ఈ కారణంగానే క్యాబ్ డ్రైవర్లు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.

ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

భారతదేశంలో వలస కూలీలను మరియు లాక్ డౌన్ లో ఇరుక్కున్న ప్రజలను స్వస్థలాలకు చేర్చడానికి దేశంలో ట్రైన్లు పునఃప్రారంభించాయి. కొద్ది రోజుల క్రితం రవాణా మంత్రి నితిన్ గడ్కరీ దేశంలో ప్రజా రవాణాను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రజా రవాణా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 14, 2020, 11:36 [IST]
English summary
Taxi driver selling face mask to earn during lockdown. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+