Just In
- 3 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 5 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 8 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 9 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు
భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువ మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది. అంతే కాకుండా ఈ మహమ్మారి కారణంగా చాలా వ్యాపారాలు మూసివేయబడ్డాయి. ఈ కారణంగా ప్రజలు జీవనోపాధి కోసం కొత్త వ్యాపారాలు మరియు వెంచర్లను ప్రారంభిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఫలితంగా వేలాది టాక్సీ మరియు క్యాబ్ డ్రైవర్లు నిరుద్యోగులుగా మారారు.
కరోనా కారణంగా ఆదాయ వనరులు లేనందున, క్యాబ్ డ్రైవర్లు సంపాదించడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్లో వందలాది క్యాబ్ డ్రైవర్లు ప్రస్తుతా జీవనోపాధికోసం పండ్లు, జ్యుస్ వంటివి అమ్మడం ప్రారంభించారు. టాక్సీ డ్రైవర్లు తమ టాక్సీలలో జ్యుస్ తయారుచేసే యంత్రాలు మరియు స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇది కొత్త ప్రస్తుత కాలంలో మంచి ఆదాయ వనరుగా మారింది.
హైదరాబాద్లో చాలా మంది టాక్సీ డ్రైవర్లు బ్యాంకు లోన్ లలో టాక్సీ కొనుగోలు చేయడం జరిగింది. ఎటువంటి ఆదాయం లేకుండా బ్యాంకు లోన్ తిరిగి కట్టడం చాలా కష్టతరమైన పని. ఆదాయం లేకపోయినా వడ్డీని తిరిగి చెల్లించడం కచ్చితంగా కస్టమర్ యొక్క బాధ్యత.
MOST READ:చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్
దీనికి సంబంధించిన నిబంధనల ప్రకారం చాలా మంది క్యాబ్ డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్లు గడువు ముగిశాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగియడంతో ఓలా మరియు ఉబర్ తమ డ్రైవర్ల ఐడిలను బ్లాక్ చేశారు. ఈ డ్రైవర్లు యొక్క బుకింగ్లను అంగీకరించలేరు.
ఓలా, ఉబర్ వంటి సంస్థలు లైసెన్స్ పొందిన క్యాబ్ డ్రైవర్లను బ్లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గడువు ముగిసిన వాహనానికి సంబంధించిన అన్ని పత్రాల చెల్లుబాటు వ్యవధిని సెప్టెంబర్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
MOST READ:భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కొంత ఉపశమనం ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన్ మిత్రా పథకం కింద మొత్తం రూ. 2662 కోట్లు ఆటో, టాక్సీ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం 2,62,493 డ్రైవర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ ప్రజల జీవితాలపై ఎక్కువ ప్రభవాన్ని చూపించింది.