గిఫ్ట్గా పొందిన కారుని గురువుకి గిఫ్ట్గా ఇచ్చిన ఇండియన్ క్రికెటర్, ఎవరో తెలుసా?
ఇండియన్ క్రికెట్ టీమ్ 2021 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి ఘన విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో మంచి పర్ఫామెన్స్ చూపించిన ఆరుగురు క్రికెటర్లకు కొత్త థార్ ఎస్యూవీని గిఫ్ట్ గా ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. ఇందులో నటరాజన్ కూడా ఉన్నారు.

ప్రకటన చేసిన విధంగానే మహీంద్రా షోరూమ్ల ద్వారా క్రికెటర్లకు కొత్త తరం థార్ ఎస్యూవీలను గిఫ్ట్ గా ఇచ్చారు. తమిళనాడులోని సేలం జిల్లాకి చెందిన ఫాస్ట్ బౌలర్ నటరాజన్ కు కూడా కొత్త థార్ ఎస్యూవీ గిఫ్ట్ గా లభించింది. అయితే కారు తీసుకున్నప్పటి నుంచి నటరాజన్ ఉపయోగించలేదు.

నటరాజన్ తన కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీని తన గురువు జయప్రకాష్కు ఇటీవల గిఫ్ట్ గా ఇచ్చేసాడు. ఇది వరకే నటరాజన్ అనేక ఇంటర్వ్యూలలో జయప్రకాష్ గురించి ప్రస్తావించారు. నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి జయప్రకాష్ ప్రధాన కారణం. ఈ కారణంగా, కొత్త మహీంద్రా థార్ ఎస్యూవీని జయప్రకాశ్ కి గిఫ్ట్ గా ఇచ్చారు.

నటరాజన్ చేసిన ఈ పని అతని అభిమానులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎంతగానో ప్రశంసించారు. ప్రస్తుతం కొత్త థార్ ఎస్యూవీలను పొందడానికి వినియోగదారులు చాలా రోజులపాటు ముందు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో కూడా నటరాజన్ కారును వారి గురువుకు సొంత చేశారు.

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్యూవీలలో మహీంద్రా అండ్ మహీధ్ర కంపెనీ యొక్క థార్ ఒకటి. మహీంద్రా & మహీంద్రా 2020 అక్టోబర్ 2 న కొత్త థార్ ఎస్యూవీని దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. పాత మోడల్తో పోలిస్తే కొత్త మోడల్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
MOST READ:వాణిజ్య వాహనాల నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి టాటా మోటార్స్ కొత్త వ్యూహం

ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం వల్ల, పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకర్షిస్తోంది. భారతదేశం అంతటా ప్రముఖులతో సహా చాలా మంది వినియోగదారులు కొత్త థార్ ఎస్యూవీలను బుక్ చేస్తున్నారు. కావున డిమాండ్ భారీగా ఉంది.

డిమాండ్ ప్రస్తుతం ఎక్కువగా ఉన్నప్పటికీ వినియోగదారుల కంపెనీ పూర్తిగా అందించలేకపోతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత దీనికి ప్రధాన కారణం. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రధానమైన వాటిలో సెమీ కండక్టర్లు ఒకటి. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ల కొరత వల్ల థార్ ఎస్యూవీల ఉత్పత్తికి ఆలస్యం అవుతోంది.

ప్రస్తుతం ఈ కారణంగానే కొత్త థార్ ఎస్యూవీ కోసం కస్టమర్లు చాలా రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. ఇప్పటికే కొత్త థార్ ఎస్యూవీని బుక్ చేసుకున్న వారు డెలివరీ ఎప్పుడు లభిస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఇదిలావుండగా, తనకు కొత్త థార్ ఎస్యూవీని బహుమతిగా ఇచ్చినందుకు ఆనంద్ మహీంద్రాకు టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ నటరాజన్ కృతజ్ఞతలు తెలిపారు.


Click it and Unblock the Notifications








