Just In
- 4 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 8 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 10 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 13 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం 7 కోట్ల ఖరీదైన బుల్లెట్ ప్రూఫ్ బస్సు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భద్రత దృష్ట్యా అధికారులు బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయనున్నారు.
థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి, మూడో కూటమితో కేంద్ర రాజకీయ పగ్గాలు చేపడతానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర మరియు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్దమైన కేసీఆర్కు నక్సల్ ముప్పు ఉన్నట్లు అధికారులను అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ ముఖ్యమంత్రి భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.
Recommended Video
జిల్లా పర్యటనల కోసం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. పూర్తి స్థాయి బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్ర రవాణ శాఖకు అప్పగించినట్లు తెలిసింది.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించనున్నారు. మరియు కేసీఆర్ గారికి ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఎక్కువగా ఉండటంతో, ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని బుల్లెట్ ప్రూఫ్ బస్సును తయారు చేయించనున్నారు.
ఇటీవల తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో భద్రతా బలగాలు సుమారుగా పది మంది మావోలను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నక్సల్స్ నుండి కేసీఆర్కు ముప్పు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సుమారుగా రూ. 7 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ కోనుగోలు చేసే అవకాశం ఉంది.
కేసీఆర్ కోసం వద్ద ఇప్పటికే 4 కోట్ల రుపాయలు విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ బెంజ్ బస్సు ఉంది. దీనికి, అదనంగా మరిన్ని భద్రత మరియు ఇంటీరియర్ ఫీచర్లతో ఈ బస్సును కొనుగోలు చేస్తున్నారు. కొత్త బస్సు అందుబాటులోకి వస్తే, పాత బస్సును ప్రత్యామ్నాయ అవసరాలకు ఉపయోగిస్తారు.
నూతన బుల్లెట్ ప్రూఫ్ బస్సు కోసం టెండర్లను ఆహ్వానించేందుకు ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు కొనుగోలు ప్రతిపాదనను ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా బస్సులో ఉండాల్సిన అన్ని తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లు, బుల్లెట్ ప్రూఫ్ మరియు ల్యాండ్ మైన్ ప్రూఫ్ అంశాలని పరిశీలించి, తుది ఆమోదం కోసం ప్రతిపాదనలను జిఎడి కి పంపుతారు.
అనుమతులు వచ్చిన తరువాత, టెండర్లను ఖరారు చేసిన అనంతరం రెండు లేదా మూడు నెలల్లోపు బుల్లెట్ ప్రూఫ్ బస్సు సిద్దం కానుంది. ప్రస్తుతం కేసీఆర్కు జడ్ ప్లస్ సెక్యురిటీ ఉంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ 24 గంటలు వ్యక్తిగత భద్రతను పర్యవేక్షిస్తుంటుంది.