Just In
- 35 min ago
మాస్క్, హెల్మెట్ లేకుండా రైడ్ చేసిన ప్రముఖ బాలీవుడ్ హీరోకి ట్రాఫిక్ ఛలాన్
- 45 min ago
మార్చి 2న హ్యుందాయ్ బేయోన్ క్రాసోవర్ ఆవిష్కరణ - వివరాలు
- 54 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 1 hr ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
Don't Miss
- Movies
Check 1st day collections: బాక్సాఫీస్ వద్ద నితిన్ స్టామినా.. తొలి రోజు ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే..
- News
ఎన్టీఆర్ కాదు నేనే వస్తా .. లేదంటే లోకేష్ ను పంపుతా : కుప్పంలో చంద్రబాబు వ్యాఖ్యలు
- Sports
స్పిన్ బౌలింగ్ను సరిగ్గా ఆడలేని ఇంగ్లండ్ను కాకుండా.. పిచ్ను విమర్శించడం ఏంటి: గ్రేమ్ స్వాన్
- Finance
తగ్గనున్న విమాన ఛార్జీలు- డీజీసీఏ కీలక అనుమతి- ఆ సేవలు ఇక విడివిడిగానే
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మళ్ళీ లాంగ్ డ్రైవ్లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా
ప్రముఖ దక్షిణాది నటుడు అజిత్ కుమార్ సినీరంగంలో తనకంటూ ఒక పేరుని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అజిత్ వాలిమై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ దాదాపు 90% పూర్తయింది. ఈ చిత్రం వినోద్ దర్శకత్వంలో, బోనీ కపూర్ నిర్మాతగా తెరకెక్కనుంది.

అజిత్ నటిస్తున్న ఈ 'వాలిమై' చిత్రం అప్డేట్స్ కోసం అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నటుడు అజిత్ యొక్క కొత్త ఫోటో ఒకటి విడుదలైంది. ఈ ఫోటోలో అజిత్ జాకెట్ ధరించిన అభిమానితో నిలబడి ఉండడాన్ని మీరు చూడవచ్చు.

దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, ఈ ఫోటో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో తీసినట్లు తెలుస్తుంది. తలా అజిత్ వారణాసి రోడ్డు పక్కన ఉన్న షాపులో తినడానికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో తీసినట్లు చెబుతారు. ఈ ఫోటోకు సంబంధించి రకరకాల సమాచారం వెలువడింది.
MOST READ:ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే

ఇటీవల అజిత్ బైక్ ద్వారా సిక్కిం వెళ్ళాడు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం భూటాన్, టిబెట్ మరియు నేపాల్ సరిహద్దుల్లో ఉంది. ఈ సుందరమైన ఈ ప్రాంతానికి అజిత్ బైక్ మీద వెళ్లినట్లు సమాచారం. సిక్కిం వెళ్లే దారిలో తలా అజిత్ తన బైక్ను వారణాసిలో పార్కింగ్ చేసి రోడ్డు పక్కన ఉన్న షాపులో కనిపించాడు.

ఒక అభిమాని అజిత్ ని గుర్తించి అతనితో ఫోటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో బాగా వైరల్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ మధ్య దూరం 2,400 కిలోమీటర్లు.
MOST READ:సైనికుల కోసం బుల్లెట్ బైక్లనే మొబైల్ అంబులెన్స్లుగా మార్చేశారు..

అజిత్ తన పర్యటనలో మొత్తం 4,500 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. ఈ పర్యటనకి సంబంధించి మరింత సమాచారం అందుబాటులో లేదు. అయితే ఈ విధంగా బైక్ పై వెళ్లడం అజిత్ కి కొత్తేమీ కాదు, ఇంతకుముందు తలా అజిత్ చాలాసార్లు ఈ విధంగా ప్రయాణించారు.

అజిత్ కుమార్ అప్పుడప్పుడు లాంగ్ డ్రైవ్ వెల్తూ ఉంటాడు. అజిత్ దాదాపు ఒక నటుడుగా మాత్రమే అందరికి తెలుసు, కానీ దేశంలో అత్యుత్తమ బైక్ రైడర్స్ లో ఒకరు అన్న విషయం చాలామందికి తెలియదు. అజిత్ అనేక లగ్జరీ కార్లు మరియు స్పోర్ట్స్ బైక్లు కలిగి ఉన్నారు.
MOST READ:కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు

అజిత్ కుమార్ ఒక్క తమిళ భాషలో మాత్రమే కాకుండా తెలుగు భాషలోని సినిమాలలో కూడా నటించాడు. కావున తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అజిత్ కి ఎక్కువమంది అభిమానులు ఉన్నారు.