వామ్మో.. పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లనే దొంగలించారు.. ఎక్కడనుకుంటున్నారా..!
సమాజంలో కొంతమంది పోలీసులపై ప్రజలకు కొంత చెడు అభిప్రాయం ఉన్నప్పటికీ, కొంతవరకు ఇప్పటికి పోలీస్ వ్యవస్థను మరియు నిజాయితీగల పోలీసులను ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొంత వరకు పోలీసుల నుంచి న్యాయం మరియు రక్షణ లభిస్తోంది.

పోలీస్ స్టేషన్ అన్నా పోలీసులన్నా ఇప్పటికి కొంతమందిలో తెలియని నమ్మకం మరియు గౌరవం వుంది. కానీ ఇటీవల ఒక వ్యక్తి తన కారుని పోలీస్ స్టేషన్ సమీపంలో ఆతృతగా పార్కింగ్ చేసాడు, కానీ చివరికి అతడు అక్కడికి వచ్చి చూసే సరికి పెద్ద షాక్ కి గురయ్యాడు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లు దొంగిలించబడ్డాయి.

పోలీస్ స్టేషన్ సమీపంలో ఆపి ఉంచిన కారు టైర్లు దొంగలించబడటంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు ఎంత నిర్భయంగా తిరుగుతున్నారో మనకు అర్థమవుతుంది. ఇటీవల కాలంలో వాహన దొంగతనం కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి.

ఇక ఈ సంఘటన విషయానికి వస్తే, మహారాష్ట్రలో నివసిస్తున్న 30 ఏళ్ల రవీంద్ర భగత్చంద్ మారుతి సుజుకి సెలెరియో కారును కలిగి ఉన్నారు. గత సోమవారం ఆయన ఇంటి వద్ద ఒక చిన్న పార్టీ జరిగింది. ఈ పార్టీకి హాజరు కావడానికి వారి బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

తమ ఇంటి ఆవరణంలో వాహనాలను పార్క్ చేయడానికి తగినంత స్థలం లేనందున, వారు తమ కారును సురక్షితమైన స్థలంలో ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ కారణంతో కారును సికాలి పోలీస్ స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచారు. వారి సెలెరియో కారు సోమవారం రాత్రి పోలీస్ స్టేషన్ నుండి 50 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచబడింది.

పోలీస్స్టేషన్ సమీపంలో కారుని నిలిపి వుంచడం వల్ల దొంగతనం కాదని అతడి నమ్మకం. కానీ మరుసటి రోజు ఉదయం అతను కారు తీయటానికి వచ్చినప్పుడు, ఒక్క సారిగా షాక్ కి గురయ్యాడు. కారుకున్న చక్రాలను ఎవరో దొంగలించి కారు కింద పెద్ద రాళ్లను ఉంచారు.

వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలంలో సిసిటివి కెమెరాలను పరిశీలించారు. సిసిటివిలో నలుగురు వ్యక్తులు వేర్వేరు వాహనాల్లో వచ్చి చక్రాలు దొంగిలించినట్లు తెలిసింది. ఈ గుర్తు తెలియని వ్యక్తులను పోలీసులు పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. ఆ దొంగలు కేవలం చక్రాలను మాత్రమే కాకుండా, కారు బ్రేక్ కాలిపర్, డిస్క్ కూడా దొంగిలించారు.

కారు నుంచి దొంగలించిన ఆ టైర్ల ధర దాదాపు 20000 రూపాయలని కార్ ఓనర్ తెలిపాడు. కారు ఓనర్ ఇచ్చిన కంప్లైంట్ పై పోలీసులు ఐపిసి సెక్షన్ 379 కింద కేసు నమోదు చేశారు. కేసును సీరియస్గా తీసుకున్నామని, త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఈ రకమైన సంఘటనలతో వాహన యజమానులు భయభ్రాంతులకు గురవుతారు. ఇలాంటి సంఘటనలు సురక్షితమైన పార్కింగ్ ప్లేస్ లేని వాహనదారులు ప్రశాంతంగా పార్కింగ్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఈ రకమైన సంఘటనలు జరగకుండా నిరోధించడానికి సరైన పార్కింగ్ స్థలం ఉండటం చాలా అవసరం.


Click it and Unblock the Notifications








