ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. రోడ్డు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం రోడ్డు నియమాలను పాటించకపోవడమే. రోడ్డు నియమాలను సరిగ్గా పాటించకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి అంతే కాకుండా ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది.

ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

బెంగళూరులో ఆదివారం తెల్లవారుజామున జరిగిన బైక్ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. నివేదికల ప్రకారం మరియు వీడియోలో చూసినట్లుగా, ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నగర శివార్లలోని జక్కూర్ లోని జికెవికె సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

ఈ ముగ్గురు వ్యక్తులు కర్ణాటకలోని బెంగళూరులోని గోవిందపుర ప్రాంతంలో నివసిస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా భారతీయ రోడ్లపై వీలింగ్ నిషేధించబడింది. కొందరు ఈ నిబంధనను నిషేధించినప్పటికీ పాటించరు. దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తాయి.

బెంగళూరులోని విమానాశ్రయం రోడ్‌లోని జక్కూర్ ఎయిర్‌ఫీల్డ్‌లో యువకులు బైక్‌పై అతివేగంగా వెళ్తున్నారు. బైక్ పై వీలింగ్ చేయడం వల్ల బైక్‌పై వెళుతున్న యువకుడు, స్కూటర్‌లో ఉన్న యువకున్ని ఢీ కొట్టడం వల్ల బైక్ పై వెళ్తున్న యువకుడు మరియు స్కూటర్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు.

MOST READ:వరుసగా 16 వ రోజు చుక్కలు చూపిస్తున్న డీజిల్ & పెట్రోల్ ధరలు

ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి వెళుతుండగా మరణించారు. ముగ్గురూ యలహంక వైపు వెళ్తున్నారు. యమహా ఆర్‌ఎక్స్ బైక్, డియో స్కూటర్ మధ్య ఈ ఆక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురూ ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో తమ వాహనాల్లో ప్రయాణించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోయి స్కూటర్‌ను ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

MOST READ:కరోనా భయం లేదు; భారత్‌లో పెరగనున్న సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్

ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

మృతులను గోవింద్‌పుర నివాసి 16 ఏళ్ల మహ్మద్ ఆది అయాన్, నాగౌర్‌లో నివసిస్తున్న 17 ఏళ్ల మజ్ అహ్మద్ ఖాన్, హెచ్‌బిఆర్ లేఅవుట్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల సయ్యద్ రివాజ్ ఉన్నట్లు గుర్తించారు. యమహా ఆర్‌ఎక్స్ బైక్‌కు నంబర్ ప్లేట్ కూడా లేదు.

యుక్తవయస్సుగల వయస్సు తాము అనుకున్నది చేస్తూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు వారిపై శ్రద్ధ చూపడం మంచిది. ఈ వయసు పిల్లలకు హై స్పీడ్ బైక్‌లు ఇవ్వకుండా ఉండటం చాలా వరకు మంచిది. ఈ రకమైన ప్రమాదం జరిగినప్పుడు తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ప్రమాదం వల్ల తమ వారు చనిపోతే ఆ మానసిక క్షోభ భరించాల్సి వస్తుంది.

రహదారి భద్రతపై దేశవ్యాప్తంగా నిరంతరం ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి యువత నిర్లక్ష్యం వల్ల డ్రైవింగ్ చేసి చనిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు అమాయక ప్రాణాలను త్యాగం చేస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా జాలీ రైడ్ అండ్ వీలింగ్ వల్ల యువత ప్రాణాలు కోల్పోతున్నారు.

MOST READ:భారత్‌లో కరోనా భయంతో ఉత్పత్తి పెంచిన మారుతి సుజుకి సప్లయర్స్

ఖాళీ రోడ్డుపై బైక్ స్టంట్స్ : ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు యువకులు [వీడియో]

రోడ్డు ప్రమాదాలను దాదాపు 25% తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు, నిబంధనలు అమలు చేసినా ప్రజలు జాగ్రత్తగా వాహనాలను నడపకపోతే ఇలాంటి విపత్తులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా రోడ్డు నియమాలు పాటించడం వల్ల ఇలాంటి ప్రమాదాలను కొంతవరకు నివారించవచ్చు.

Most Read Articles

English summary
3 Killed While Performing Stunts On Bike In Bengaluru. Read in Telugu.
Story first published: Monday, June 22, 2020, 20:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X