లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకి విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఎంతోమంది ప్రజల ప్రాణాలను తీస్తోంది. ఇటలీ, ఫ్రాన్స్, అమెరికా వంటి అగ్ర దేశాలు కూడా ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. కరోనా వైరస్ ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయి.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

కరోనా వైరస్ నివారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా మొత్తం లాక్ డౌన్ విధించబడింది. లాక్ డౌన్ లో భాగంగా ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదని ఆంక్షలు విధించారు. ఇప్పటికే భారతదేశంలో లాక్ డౌన్ ఒక నెల పూర్తి చేసుకుంది. ఇప్పుడు లాక్ డౌన్ రెండవదశ అమలులో ఉంది. లాక్ డౌన్ భారతదేశంలోనే కాకుండా దాదాపు అన్ని దేశాలలో అమలు చేయబడింది.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

లాక్ డౌన్ లో బయట తిరిగే ప్రజలపై అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయినప్పటికీ లాక్ డౌన్ లో బయట తిరిగే వారి సంఖ్య తగ్గించలేకపోతున్నారు. అనవసరంగా బయటకు వచ్చే వారిని పూర్తిగా ఆపడానికి తమిళనాడు పోలీసులు ఒక భిన్నమైన చర్యకు పాల్పడ్డారు. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలి. కానీ ఇలా కాకుండా అనవసరంగా బయటికి వచ్చిన వ్యక్తులను అంబులెన్స్‌లోకి పంపిస్తారు. ఈ అంబులెన్సులో కరోన సోకినా వ్యక్తితో గంటసేపు గడపాలి. ఇటువంటి భిన్నమైన చర్య తమిళనాడు పోలీసులు అమలులోకి తెచ్చారు.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

భయంకరమైన ఈ కరోనావైరస్ గురించి అవగాహన పెంచడానికి ఈ విధమైన చర్య మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న రహదారిలో ముగ్గురు యువకులు స్కూటర్‌లో ట్రిపుల్ రైడ్‌లో వస్తారు. వారిని పోలీసులు ఆపి అంబులెన్స్‌లోకి పంపిస్తారు.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

అంబులెన్స్ లోపల కరోనా పేషంట్ స్ట్రెచర్ మీద ఉంటాడు. అతనితో పాటు ముగ్గురు యువకులను అంబులెన్స్‌లో ఉంచారు. భయపడిన యువకులు అంబులెన్స్ నుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్లు మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

కరోనా పేషంట్ నుంచి తప్పించుకోవడానికి ఆ యువకులు కిటికీలో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అంబులెన్సులో వారి చేసే చర్యలు చూసేవారికి నవ్వును తెప్పిస్తాయి. అంతే కాకుండా ఆ యువకులు పేస్ మాస్కులు కూడా ధరించలేదు. కరోనా వైరస్ రోజు రోజుకి అత్యధికంగా వ్యాపిస్తున్నప్పుడు కనీసం సామాజిక భాద్యత లేకుండా ఈ విధంగా చేయడం ఒక గుణపాఠం అవుతుంది.

దీని గురించి పోలీసులు వివరిస్తూ అనవసరంగా బయటకు వచ్చే వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ఈ విధంగా చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఆ యువకులకు మరణ భయం ఎలా ఉందొ తెలిసి ఉంటుంది.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

అంబులెన్సు స్టేచర్ మీద ఉన్న వ్యక్తికి 'కరోనా ఇన్‌ఫెక్షన్' లేదు. ఈ వైరస్ సంక్రమణ నిజంగా జరిగితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించడానికి తిరుపూర్ పోలీసులు ఈ కొత్త ఉపాయాన్ని ప్రారంభించారు.

లాక్‌డౌన్ ఉల్లంగిస్తే కరోనా పేషంట్ దగ్గరికి పంపిస్తున్న పోలీసులు, ఎక్కడో తెలుసా..?

అంబులెన్సు స్టేచర్ మీద ఉన్న వ్యక్తికి 'కరోనా ఇన్‌ఫెక్షన్' లేదు. ఈ వైరస్ సంక్రమణ నిజంగా జరిగితే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించడానికి తిరుపూర్ పోలీసులు ఈ కొత్త ఉపాయాన్ని ప్రారంభించారు.

More from DriveSpark

Article Published On: Saturday, April 25, 2020, 14:57 [IST]
English summary
Tiruppur Police new awareness concept for coronavirus. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+