ఒక్కసారిగా భారీ స్థాయిలో తగ్గిన టోల్ వసూల్.. కారణం ఇదే
భారతదేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ తరుణంలో దేశంలో చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ అమలు చేయబడింది. కరోనా లాక్ డౌన్ అమలు చేయబడిన దాదాపు అన్ని రాష్ట్రాల్లో ట్రాఫిక్ పరిమితం చేయబడింది. అంతే కాకుండా ఈ సమయంలో ప్రజా రవాణా పూర్తిగా రద్దు చేయబడింది.

ప్రజా రవాణా రద్దు చేయడం వల్ల బస్సులు, ట్రైన్ మరియు విమాన సర్వీసులు కూడా నిలిపివేయబడ్డాయి. ఇదిలా ఉండగా సాధారణంగా ఈ లాక్ డౌన్ సమయంలో కార్లు మొదలైన వాహనాలు కూడా బయటకు రావడం లేదు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా మే నెలలో టోల్ వసూళ్లు 25% నుండి 30% వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.

భారత క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఐసిఆర్ఎ) ప్రకారం, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి అనేక రాష్ట్రాల్లో పూర్తి లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ హైవేలలో వాహనాల కదలికను పూర్తిగా తగ్గించింది. నివేదికల ప్రకారం కరోనా లాక్ డౌన్ వల్ల ఏప్రిల్ లో కూడా టోల్ వసూల్ బాగా తగ్గింది.

లాక్ డౌన్ ఇప్పుడు కూడా కొనసాగుతున్న కారణంగా గత ఏప్రిల్ నెలకంటే ఈ నెలలో టోల్ వసూలు 25% నుండి 30% వరకు తగ్గే అవకాశం ఉంది. మార్చితో పోల్చితే ఏప్రిల్లో టోల్ వసూలు 10% పడిపోయిందని ఐసిఆర్ఎ నివేదించింది.

కరోనా కేసులు ఒకవేళా తగ్గుముఖం పడితే లాక్డౌన్ ఆంక్షలు సడలించవచ్చని భావిస్తున్నారు. ఈ విధంగా జరిగినట్లయితే జూన్ నాటికి టోల్ వసూలు క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఐసిఆర్ఎ తెలిపింది. అప్పుడు టోల్ వసూలు యధా స్థానానికి చేరుకుంటుంది.

నివేదికల ప్రకారం 2019 మరియు 2020 లో జాతీయ రహదారులపై వసూలు చేసిన మొత్తం టోల్ వసూలు దాదాపు రూ. 26,851 కోట్లు అని తెలిసింది. అదే విధంగా 2018 మరియు 2019 లో ఈ మొత్తం రూ. 24,396 కోట్లు. ఇటీవల ఐసిఆర్ఎ మార్చి 11 నుండి మే 10 వరకు మొత్తం 11 రాష్ట్రాల టోల్ వసూలుపై ఒక నివేదికను సిద్ధం చేసింది.

ఈ నివేదిక ప్రకారం, టోల్ వసూలులో మహారాష్ట్ర చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం మహారాష్ట్రలో లాక్ డౌన్ ఇతర రాష్ట్రాల కంటే ముందుగా విధించారు. కావున ఇక్కడ రవాణా మొత్తం అప్పటి నుంచే పరిమితం చేయబడింది. మహారాష్ట్రతో పాటు, రాజస్థాన్ కూడా టోల్ వసూళ్లలో భారీగా క్షీణించింది.

రాజస్థాన్ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల పర్యాటక వాహనాలను పూర్తిగా నిషేధించారు. దీనివల్ల రాజస్థాన్లో టోల్ వసూలు బాగా తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కరోనా ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగా ఉంది. ఈ సమయంలో ఆటో పరిశ్రమలు కూడా ఉత్పత్తులు నిలిపివేసి కరోనా పోరాటంలో సహకరిస్తున్నాయి.

అయితే కొన్ని కంపెనీలు ఉత్పత్తి నిలిపివేసి ఆక్సిజన్ అందించడంలో నిమగ్నమై ఉన్నాయి. ఇప్పుడు రోడ్డుపై తక్కువ సంఖ్యలో కమర్షియల్ వాహనాలు తిరుగుతున్నాయి. కరోనా వైరస్ యొక్క సెకండ్ వేవ్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే టోల్ ఆదాయంలో బాగా తగ్గడానికి కారణమవుతుంది.


Click it and Unblock the Notifications








