షాకింగ్ న్యూస్.. సెప్టెంబర్ నుంచి పెరగనున్న టోల్ ఫీజులు.. ఎక్కడో తెలుసా?
భారతదేశంలో రోజురోజకి పెరుగుతున్న ఇంధన ధరలు ఒక వైపు సామాన్య మానవుడిపై పెనుభారాన్ని మోపుతుంటే, మరో వైపు హైవేలలో టోల్ ఫీజుల ధరలు మరింత భారాన్ని మోపుతున్నాయి. ఈ కారణంగా వాహనాదారులు గత కొంతకాలంగా హైవేలపై ఉన్న టోల్ గేట్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. అంతే కాకుండా దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యంలో ఉన్న టోల్ గేట్లను తగ్గించాలి వాహనదారుల దీర్ఘకాల డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

వాహనదారులు ఎన్ని డిమాండ్స్ చేసిన ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఊరుకుంటున్నాయి. కావున వాహనదారుల డిమాండ్స్ నెరవేరే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. కనీసం టోల్ ఫీజు తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

వాహనదారుల డిమాండ్స్ తీర్చకపోగా, వాహనదారుల డిమాండ్కు వ్యతిరేకంగా టోల్ ఫీజులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మన పొరుగు రాష్ట్రమయిన తమిళనాడులో ఇప్పుడు టోల్ ఫీజులు పెరుగుదల దిశవైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

నివేదికల ప్రకారం తమిళనాడులోని మొత్తం 14 టోల్ గేట్లలో టోల్ ఫీజును పెంచనున్నట్లు చెబుతున్నారు. ఈ టోల్ గేట్లలో టోల్ ఫీజులు 8%పెరిగే అవకాశం ఉంది. ఇది 2021 సెప్టెంబర్ 01 నుంచి అమలులోకి రానుంది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలతో సతమతమవుతున్న వాహనదారులకు టోల్ ఫెంచారనే వార్త మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తుంది.

టోల్ ఫీజు పెంపుపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. అయితే దీనికి సంబంధించిన సమాఛారం నేషనల్ హైవే అథారిటీ అధికారులు వచ్చే వారం అధికారిక ప్రకటనలో జారీ చేయనున్నారు. అధికారిక ప్రకటన తర్వాత 14 టోల్ ప్లాజాలలో టోల్ ఫీజు పెరుగుతుంది.

నివేదికల ప్రకారం, తిండివనం-ఉలుందూరుపేట రోడ్డులోని విక్రవండి టోల్గేట్ మరియు ఉలుందూరుపేట-బదలూరు రహదారిపై తిరుమంతురై టోల్గేట్ వద్ద టోల్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, చెన్నై-తడ రోడ్డులోని నల్లూర్ టోల్గేట్ మరియు సేలం-కుమారపాలెం రోడ్డులోని వైకుంఠం టోల్గేట్ వద్ద కూడా టోల్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సేలం-ఉలుందూరుపేట రోడ్డులోని మెట్టుపట్టి టోల్గేట్ వద్ద ఛార్జీల పెంపు అమల్లోకి వస్తుందని కూడా చెబుతున్నారు.

అంతే కాకుండా తిరుచ్చి-దిండిగల్ రహదారిలోని పొన్నంబలపట్టి టోల్గేట్ మరియు తంజావూరు-తిరుచ్చి రహదారిపై వాజవడన్కోటై టోల్గేట్ వద్ద టోల్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమాచారం ఇప్పటికే వివిధ సంక్షోభాలలో వాహన యజమానులకు ఆందోళన కలిగించింది.

ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడంతో ఇప్పటికే వాహన యజమానులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. భారతదేశంలో ఇంధన ధరలు చాలా రాష్ట్రాల్లో రూ. 100 పైగా దాటింది. అందువల్ల వాహనాల యజమానులు పన్నులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆవేదనను గుర్తించలేదు. అయితే తమిళనాడులో ఎం. కె. స్టాలిన్ ప్రభుత్వం ఇటీవల పెట్రోల్ ధరను 3 రూపాయలు తగ్గించారు. ఈ ధర తగ్గింపు తమిళనాడు వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించింది. ఇటీవల, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గించబడదని చెప్పారు.

పైన చెప్పిన ఇటువంటి కారణాల వల్ల ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగింది. డిమాండ్ పెరగడంతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి ఆటోమేకర్ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రఖ్యాత వాహన తయారీదారులు మరియు స్టార్టప్ కంపెనీలు దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా విడుదల చేస్తున్నాయి.

టోల్ ప్లాజాల పరంగా, ద్విచక్ర వాహనాలు మినహా టోల్ ప్లాజాల గుండా వెళ్లే అన్ని వాహనాలు తప్పనిసరిగా టోల్ ఫీజు చెల్లించాలి. గత సంవత్సరం వరకు, టోల్ ఫీజు చెల్లించడానికి వాహనాలు గంటల కొద్దీ టోల్ ప్లాజాలలో వేచి ఉండాలి. ఇది వాయు కాలుష్యానికి కూడా కారణమైంది.

టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు వేచి ఉండకుండా నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం వాహనాలలో ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసింది. ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్లను వాహనం ముందు భాగంలోని విండ్షీల్డ్పై అమర్చారు. ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ ఉన్న వాహనాలు టోల్ ప్లాజా గుండా వెళుతున్నప్పుడు టోల్ ఫీజు ఆటోమాటిక్ గా ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ నుండి తీసివేయబడుతుంది.

ఈ సంవత్సరం ఫిబ్రవరి నుండి టోల్ ప్లాజాలలో ప్రయాణించే వాహనాలు తప్పనిసరిగా ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉండాలి. టోల్ ప్లాజా గుండా ఫాస్ట్ ట్యాగ్ లేకుండా ప్రయాణించే వాహనాలకు డబుల్ టోల్ వసూలు చేయబడుతుంది. కొత్తగా విడుదల చేసిన కార్లతో పాటు ఫాస్ట్ ట్యాగ్లను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం వాహన తయారీదారులను ఆదేశించింది.
Note: Images used are for representational purpose only.


Click it and Unblock the Notifications