టోల్ ట్యాక్స్ ఆగేది కాదు.. జీవితాంతం కట్టాల్సిందే.. వాహనదారులకు షాక్ ఇచ్చిన కేంద్ర మంత్రి

జాతీయ రహదారుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు టోల్‌ ప్లాజాల వద్ద ట్యాక్స్‌ చెల్లిస్తుంటారు. ఇవి దేశంలోని బ్రిడ్జీలు, టన్నెల్లు, జాతీయ, రాష్ట్ర రహదారుల మెయింటెనెన్స్, ఉపయోగం కోసం విధించే పన్నులు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ ట్యాక్స్ వసూలు చేసేందుకు కొన్ని నియమాలు, నిబంధనలను రూపొందించింది.

ఈ నిబంధనలలో కొంతమంది ప్రత్యేక వ్యక్తులు, కొన్ని ప్రత్యేక వాహనాలకు టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎమర్జెన్సీ సౌకర్యాలను అందించే అంబులెన్స్‌లు, ఫైర్ డిపార్ట్ మెంట్ , ఇతర వాహనాలు టోల్ ప్లాజాను దాటేటప్పుడు ఎలాంటి రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ద్వి చక్ర వాహనాలు టోల్ దాటేటప్పుడు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

Toll Tax Will Continue Nitin

అధికారిక టోల్ ట్యాక్స్ నియమాలు కూడా కొన్ని వర్గాల వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ టోల్ ట్యాక్స్ చెల్లించకుండా మినహాయింపు ఇస్తాయని పేర్కొంటున్నాయి. వీటిలో అత్యవసర వాహనాలు, సైనిక వాహనాలు, ప్రజా వాహనాలు ఉన్నాయి. వాటికి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తే డ్రైవర్లు ఫిర్యాదు చేయవచ్చు.

పెరుగుతున్న టోల్ ఫీజులు, అధ్వాన్నమైన రహదారి పరిస్థితుల పై ప్రజల ఆందోళనలు పెరుగుతుండడంతో రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. టోల్ ట్యాక్స్ ఆగదని ధృవీకరించారు. రాజ్యసభలో ఆయన ప్రసంగిస్తూ ఆయన టోల్ ప్లాజాల ఆడిట్‌లు అనవసరమన్నారు. జాతీయ రహదారులపై వినియోగదారు రుసుములు 2008 ప్రకారం టోల్ ట్యాక్స్ లు శాశ్వతంగా వసూలు చేస్తారని తెలిపారు.

Toll Tax

కొన్ని ప్రాంతాల్లో జాతీయ రహదారి నిర్మాణానికి పెట్టిన ఖర్చులు వసూలు అయ్యాయని ఈ కారణంగా ఆయా టోల్ ప్లాజాలను మూసేయాలని శాసన సభ్యులు మంత్రికి సూచించారు. అలాగే టోల్ ప్లాజాలను పెట్టి ఇన్నేళ్లు అవుతున్నా వాటి ఆడిట్ లు లేవు. దీంతో శాసన సభ్యులు టోల్ ఆడిట్లను డిమాండ్ చేశారు.

టోల్ ఆడిట్‌ డిమాండ్‌ను మంత్రి గడ్కరీ తిరస్కరించారు. టోల్ ఫీజులను ఏటా సవరించి దేశంలోని పలు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తామని పేర్కొన్నారు. చాలా టోల్ ప్లాజాలు తమ పెట్టుబడిని తిరిగి పొందిన తర్వాత కూడా అధిక ట్యాక్స్ లను వసూలు చేస్తూనే ఉన్నాయని కొందరు విమర్శిస్తున్నారు.

Toll Tax Will Continue

రోడ్ల నిర్మాణ సమయంలో ప్రైవేట్ కాంట్రాక్టర్లు వారి ఒప్పందాల ప్రకారం టోల్‌లను వసూలు చేస్తారు. ఈ వ్యవధి ముగిసిన తర్వాత ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీలు టోల్ వసూలును స్వాధీనం చేసుకుంటాయని మంత్రి తెలిపారు. జాతీయ రహదారులు, వంతెనలు, టన్నెళ్లు, బైపాస్‌ల నుండి నిరంతర ఆదాయాన్ని నిర్ధారిస్తాయి.

ప్రభుత్వ వైఖరి ఇలా ఉన్నప్పటికీ టోల్ ఆడిట్‌లు ట్యాక్స్ వసూళ్లలో పారదర్శకతను పెంచుతాయి. అధిక పన్నుల గురించి ఆందోళనలు తలెత్తుతున్నా.. పెట్టుబడులను తిరిగి పొందిన తర్వాత కూడా అనేక టోల్ ప్లాజాలు ట్యాక్సులు వసూలు చేస్తూనే ఉన్నాయి. టోల్ ఛార్జీలు పెరుగుతున్నప్పటికీ, రోడ్ల క్వాలిటీ మాత్రం పేలవంగా ఉండడంతో వ్యవస్థపై ప్రజల నమ్మకం తగ్గుతోంది.

Take a Poll

ప్రభుత్వం పర్మనెంట్ టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని పట్టుబడుతున్నప్పటికీ, ఆడిట్‌లు, పారదర్శకత కోసం ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించడానికి టోల్ ధర, జవాబుదారీతనం నిర్ధారించడం చాలా ముఖ్యం.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, March 17, 2025, 18:00 [IST]
English summary
Toll tax will continue forever shocking announcement by union minister to vehicle owners
Read more on: #offbeat #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+