అత్యంత దూరాలకు ప్రయాణికులను చేరవేస్తున్న టాప్-10 ప్యాసింజర్ రైళ్లు
దేశీయంగా ప్రజా రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న రవాణా విభాగం ఇండియన్ రైల్వే.ఇందులో సుమారుగా 12,617 ప్యాసింజర్ రైళ్లు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. అయితే వీటిలో అత్యంత దూరం ప్రయాణించే పది రైళ్ల గురించి నేటి కథనంలో తెలుసుకుందాం.

10. గౌహతి - ఎర్నాకులం రైలు/12508
గౌహతి ఎర్నాకులం రైలు గౌహతి నుండి ఎర్నాకులం వరకు సుమారుగా 3337 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రెండింటి మధ్యలో సుమారుగా 43 స్టేషన్లు కలవు. వీటి గుండా ఇది 59 గంటల 45 నిషాల పాటు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుతుంది.
Picture credit: YouTube

09. కేరళ సంపర్క్ క్రాంతి రైలు/12218
కేరళ సంపర్క్ క్రాంతి రైలు చంఢీఘర్ నుండి కోచువేళి రైల్వే స్టేషన్ వరకు సుమారుగా 3,415 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రెండింటి మధ్యలో సుమారుగా 70 స్టేషన్లు కలవు. వీటి గుండా ఇది 57 గంటల 35 నిషాల పాటు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుతుంది.
Picture credit: Superfast1111/Wiki Commons

08. రప్తిసాగర్ రైలు
రప్తిసాగర్ రైలు ఎర్నాకులం నుండి బీహార్లోని బరౌనీ వరకు సుమారుగా 3,441 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రెండింటి మధ్యలో సుమారుగా 61 స్టేషన్లు కలవు. వీటి గుండా ఇది 62 గంటల పాటు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుతుంది.
Picture credit: Superfast1111/Wiki Commons

07. డెహ్రాడూన్ కోచువేళి సూపర్ ఫాస్ట్ రైలు
డెహ్రాడూన్ కోచువేళి సూపర్ ఫాస్ట్ రైలు డెహ్రాడూన్ నుండి తిరువనంతపురంలోని కోచువేళి రైల్వేస్టేషన్ వరకు సుమారుగా 3,459 కిలోమీటర్లు పాటు ప్రయాణిస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న 25 స్టేషన్లు గుండా 61 గంటల 10 నిమిషాలు పాటు ప్రయాణించి గమ్యస్థానాన్ని చేరుతుంది.

06. డిబ్రూఘర్ ఎక్స్ప్రెస్ రైల/15901
డిబ్రూఘర్ ఎక్స్ప్రెస్ రైలు బెంగళూరులోని యశ్వపూర్ స్టేషన్ను అస్సాంలోని డిబ్రూఘర్ వరకు సుమారుగా 3,447 కిలోమీటర్లు పాటు ప్రయాణిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న 33 రేల్వేస్టేషన్లు మీదుగా 68 గంటల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుతుంది.
Picture credit: YouTube

05. గౌహతి ఎక్స్ప్రెస్/123515
బెంగళూరు నుండి అస్సాలోని డిబ్రూఘర్ చేరుకున్న తరువాత అక్కడ నుండి గౌహతి ఎక్స్ప్రెస్ ద్వారా బెంగళూరుకు చేరుకోవచ్చు. సుమారుగా 3,552 కిలోమీటర్లు మార్గంలో 50 స్టేషన్లు మీదుగా 65 గంటల పాటు ప్రయాణిస్తుంది.
Picture credit: Smeet Chowdhury/Flickr

04. టెన్ జమ్మూ ఎక్స్ప్రెస్/16787
ఈ టెన్ జమ్మూ ఎక్స్ప్రెస్ రైలు తమిళనాడులోని తిరునేల్వేలి నుండి జమ్మూ వరకు సుమారుగా 3,561 కిలోమీటర్లు మేర 70 రైల్వే స్టేషన్లు గుండా 70 గంటల పాటు ప్రయాణిస్తుంది.
Picture credit: YouTube

03. నవయుగ ఎక్స్ప్రెస్ రైలు/16687
ఇది కర్ణాటకలోని మంగళూరు నుండి జమ్మూ వరకు 3,609 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సుమారుగా 61 స్టేషన్లు గుండా 68 గంటలు పాటు ప్రయాణిస్తుంది.
Picture credit: YouTube

02. హిమసాగర్ ఎక్స్ప్రెస్
ఈ హిమసాగర్ ఎక్స్ప్రెస్ రైలు జమ్మూ కాశ్మీర్ లోని కాత్రాలో ఉన్న శ్రీ మాతా వైష్ణోదేవి నుండి కన్యాకుమారి వరకు ప్రయాణిస్తుంది. సుమారుగా 73 స్టేషన్లుగా గుండా 3,789 కిలోమీటర్లు మేర 71 గంటల 56 నిమిషాల పాటు ప్రయాణిస్తుంది.
Picture credit: Karthik Abbilash/Flickr

01. వివేక్ ఎక్స్ప్రెస్/15905
ఈ వివేక్ ఎక్స్ప్రెస్ రైలు కన్యాకుమారి నుండి అస్సాంలోని డిబ్రూఘర్ వరకు సుమారుగా 4,273 కిలోమీటర్లు పాటు ప్రయాణిస్తుంది. ఈ రెండింటి మధ్య ఉన్న 56 స్టేషన్లుగా గుండా 80 గంటల 15 నిమిషాల పాటు ప్రయాణించి గమ్యాన్ని చేరుతుంది.

సముద్రగర్బంలో పరుగులుపెట్టనున్న భారతీయ మొదటి బుల్లెట్ రైలు
భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్ప్రెస్

170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు
అద్దె భారం తగ్గించుకోవడానికి పాత వ్యాన్ను ఇల్లుగా మార్చుకున్నాడు: ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








