Just In
- 5 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 7 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 8 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 10 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రైడర్ బైక్ మీద కూర్చొని ఉండగానే బైక్ తీసుకువెళ్తున్న టోవింగ్ సిబ్బంది; వీడియో వైరల్
భారతదేశంలో కరోనా మహమ్మారి కారణంగా, చాలా మంది ప్రజలు ప్రజా రవాణాలో ప్రయాణించడానికి వెనుకాడుతున్నారు. ఈ మహమ్మారి వల్ల ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ప్రజలు సొంత వాహనాలలో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. ఈ కారణంగా ఎక్కువమంది వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇది ఒక రకంగా మంచికే అనుకున్నా, ఎక్కువ ట్రాఫిక్ కి కారణమవుతుంది.
ప్రజలు సొంత వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుండంతో ట్రాఫిక్ పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో ట్రాఫిక్ పోలీసులకు ఎక్కువ పని భారం పెరిగింది. అంతే కాకుండా ఇది పెద్ద తలనొప్పి సమస్యగా మారిపోయింది. ట్రాఫిక్ ఏర్పడటానికి ప్రధాన కారణం వాహనాలను సరిగ్గా పార్క్ చేయకపోవడం.
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి తీవ్రతరం అవుతోంది. ట్రాఫిక్ రద్దీ వల్ల భారతదేశంలోని చాలా నగరాలు ఇబ్బందిపడుతున్నాయి. దాదాపు చాలా నగరాల్లో, వాహనదారులకు సరైన పార్కింగ్ ప్లేస్ కూడా లేదు. కావున ఒక వాహనానికి మరొక వాహననానికి కొంత కూడా ప్లేస్ లేకుండా పార్క్ చేస్తున్నారు.
ఇది మాత్రమే కాకుండా చాలామంది వాహనదారులు పార్కింగ్ చేయడానికి తగిన స్థలం లేకుండా పోవడం వల్ల నో పార్కింగ్ లో పార్క్ చేస్తున్నారు. వాహనాలను ఈ విధంగా పార్కింగ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువవుతోంది. కొన్నిసార్లు ఇలాంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతాయి. ఈ కారణంగానే ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ ప్రదేశాలలో పార్క్ చేసిన వాహనాలపై చర్యలు తీసుకుంటారు.
సాధారణంగా వాహనాలు నో పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసినప్పుడు అటువంటి వాహనాలను టోవింగ్ సిబ్బంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. అయితే ఇటీవల ఒక బైక్ రైడర్ బైక్ మీద కూర్చుని ఉన్నప్పుడే ఆ బైక్ తీసుకెళ్లే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది.
నివేదికల ప్రకారం ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని నగరం పూణేలోని నానా పేట్ ప్రాంతంలో జరిగింది. ట్రాఫిక్ జామ్లను క్లియర్ చేయడంలో పూణేలోని పోలీసులు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో, రోడ్డు పక్కన ఆగి ఉన్న బైక్ను టోయింగ్ వాహనంలోకి ఎత్తివేశారు. ఆ సమయంలో బైక్ రైడర్ బైక్ మీద కూర్చున్నాడు. అతను బైక్ నుండి దిగేందుకు ప్రయత్నించినప్పటికీ, ట్రాఫిక్ పోలీసులు అతడిని కిందకు దించి, బైక్ను టోయింగ్ వాహనం లోపల పెట్టారు.
ఆ బైక్ రైడర్ ఆ ప్రాంతంలో ఎప్పుడూ బైక్ పార్క్ చేయలేదని అప్పుడే అక్కడికి వచ్చి కూర్చున్నానని చెప్పాడు, అయితే పోలీసులు అతని మాటలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నివేదికల ప్రకారం ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, నో-పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన ఏదైనా వాహనం, యజమాని పక్కన నిలబడి ఉన్నా, అది ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. కావున టోవింగ్ సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించారు.
సాధారణంగా రోడ్డుపై పార్కింగ్ లేని పక్షంలో, ఆ ప్రదేశంలో నో పార్కింగ్ అనే బోర్డు ఉంచాలి. ఇటువంటి బోర్డులు తరచుగా రద్దీగా ఉండే రోడ్లు మరియు రద్దీ ప్రాంతాల్లో ఉంచబడతాయి. ఈ ప్రాంతాల్లో వాహనాలను పార్క్ చేయకూడదు. అయితే కొన్ని ప్రాంతాల్లో నో పార్కింగ్ బోర్డ్స్ ఉండవు. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తీసుకెళ్తుంటారు. ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి.
ఇటీవల ముంబై పోలీసులు నో-పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసిన కారులో ఉన్న ఒక తల్లి తన బిడ్డకు తల్లిపాలు ఇస్తున్న సమయంలో కూడా కారును లాక్కుంటూ తీసుకెళ్లిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. వాహనాలను తీసుకెళ్లే టోవింగ్ సిబ్బంది వాహనాలను చాలా నిర్లక్ష్యంగా తీసుకెళ్లారని ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి.
వాహనాలను లాగుతున్నప్పుడు, ద్విచక్ర వాహన బంపర్లను విచ్ఛిన్నం చేయడం మరియు అద్దాలను పాడు చేయడం వంటివి టోవింగ్ సిబ్బంది అనేక ఫిర్యాదులు ఉన్నాయి. అంతే కాకుండా బెంగళూరు నగరంలో పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసిన వాహనాలను కూడా తీసుకెళ్తున్నారనే ఆరోపణలు కూడా టోవింగ్ సిబ్బందిపై ఉన్నాయి.
Note: ఈ ఆర్టికల్ లో మొదటి మూడు ఫోటోలు మినహా మిగిలినవి కేవలం అవగాహనా కోసం మాత్రమే