Just In
- 23 min ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 2 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 3 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
Don't Miss
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా లాక్ డౌన్ : నియమాలను ఉల్లఘించిన 2 వేల వాహనాలకుపైగా ఫైన్
భారతదేశంలో విజృంభించిన కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో మన భారత ప్రభుత్వం 21 రోజుల పాటు దేశం మొత్తాన్ని లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరవధికంగా లాక్ డౌన్ లో ఉన్నాయి.
భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇప్పటికే 144 సెక్షన్ విధించింది. దీని ప్రకారం ఎవరు రోడ్లపైకి రాకుండా ఇంట్లోనే ఉండి, ప్రభుత్వాలు చేపట్టిన ఈ 21 రోజుల లాక్ డౌన్ కి సహకరించి కరోనా వైరస్ నుండి విముక్తి పొందాలి. కేంద్ర ప్రభుత్వం ప్రజల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలను చేపడుతున్నప్పుడు, చాల రాష్ట్రాలలో దీనికి వ్యతిరేకంగా నడుచుకున్నారు.
మనదేశంలోని ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో పోలీసులు చట్టానికి వ్యతిరేఖించిన 2 వేలకుపైగా వాహనాలకు జరిమానా విధించారు.
దేశంలో చాల ప్రాంతాలలో లాక్ డౌన్ ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించిన వారికీ జరిమానాలు విధించారు. ఈ లోక్ డౌన్ ఉద్దేశం ఏమిటంటే ఎక్కువగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ నివారణకుగాను ప్రజలు ఎవరు ఇంటినుంచి బయటకి రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలి.
ఎటువంటి సరైన కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన ప్రజలకు సుమారు 2 వేల వాహనాలకు చలాన్లను జారీ చేశారు. రోడ్డుపైకి రావడానికి గల కారణాన్ని ఆరా తీయడానికి పోలీసులు వాహనాలను ఆపుతున్నారు.
కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న ఈ సమయాల్లో ఇంట్లో ఉండడం యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం అవసరం. పోలీసులు వాహనదారులను ఆపివేస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు ఇంటర్నెట్లో ఉన్నాయి.
నోయిడాలో యాక్టివ్ డ్యూటీలో ఉన్న పోలీసులు వాహనాలను ఆపి, వారు ఇంటి నుండి బయటకు రావడానికి కారణం అడిగారు. సంతృప్తికరమైన సమాధానం లేకపోతే పోలీసులు వారికి స్పాట్ జరిమానా జారీ చేశారు. ఎటువంటి సరైన కారణం లేకుండా లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చినందుకు ఉల్లంఘించిన వారిపై పోలీసులు దాదాపు 100 ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
ఈ రోజు నుండి 21 రోజుల పాటు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినట్లు గమనించాలి. లాక్ డౌన్ అత్యంత భయంకరమైన వైరస్ వ్యాపించకుండా ఉండటానికి దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
ఉత్తరప్రదేశ్ లోని పోలీసులు ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఇతర రాష్ట్రాల సరిహద్దులను మూసివేశాయి. లాక్ డౌన్ సమయంలో పట్టుకుని నియమాలను ఉల్లంఘించ కుండా ఉండటానికి అన్ని ప్రధాన ప్రదేశాలలో బారికేడ్లు కూడా ఉన్నాయి. నోయిడాలో సుమారు 86 పోలీసు బారికేడ్లు ఉన్నాయి.
భారతదేశంలో రాబోయే 21 రోజులు ఆరోగ్య కార్యకర్తలు, మీడియా అధికారులు మరియు అవసరమైన ఉద్యోగులను మాత్రమే రోడ్లపై అనుమతిస్తారు. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ సేవలు కూడా ఈ రోజుల్లో అందుబాటులో ఉండవు.