తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

భారతదేశంలో వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వాహనాలు పెరుగుతున్న కొద్దీ దేశ వ్యాప్తంగా ఉన్న రోడ్లు మాత్రమే విస్తరించడం లేదు. రోడ్లను విస్తరించకపోవడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ కి కారణమవుతుంది. కొన్నిసార్లు అంబులెన్సులు వంటి అత్యవసర వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుంటాయి.

తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

ట్రాఫిక్ సమస్యకు కేవలం వాహనాలు మాత్రమే కాదు నిరసనలు కూడా కారణమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో రైతులు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ కారణంగా ఢిల్లీ నగరంలో ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ ని మళ్లించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారుభారతీ బంద్‌కు రైతులు పిలుపునివ్వడంతో నిరసనకారులు రోడ్లను అడ్డుకున్నారు, ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువైంది.

తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో భారత్ బంద్ సందర్భంగా ఒక యువకుడి తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఆ యువకుడు తన తల్లిని ద్విచక్ర వాహనంలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు.

తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

కానీ భారత్ బంద్ కారణంగా వచ్చిన నిరసనలు భారీ ట్రాఫిక్ రద్దీని కలిగించాయి. ఆ యువకుడు అతని తల్లి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. యువకుడి తల్లి ఆరోగ్యం క్షీణించడాన్ని పోలీసులు గమనించి, ఆ యువకుడి సహాయానికి ముందుకు వచ్చారు.

తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

సాయి తేజ అనే యువకుడి తల్లి భారతి ఉదయం 9 గంటలకు మూర్ఛ పోయింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రి అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. మళ్ళీ కాల్ చేసినప్పుడు రోగిని తీసుకురాబోతున్నట్లు అంబులెన్స్ తెలిపింది. సాయి తేజ అనేక హాస్పిటల్స్ యొక్క అంబులెన్స్‌లకు కాల్ చేసాడు. అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం వల్ల అతని తల్లిని ద్విచక్ర వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

కానీ నిరసన వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీ గురించి ఆయనకు తెలియదు. దీంతో అతడు ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాడు. దీని గురించి సాయి తేజ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ జరిగి ఉండవచ్చని అనుకున్నానని చెప్పాడు. కానీ నిరసన కారణంగా వాహనాలు కదలడం లేదని తరువాత తెలిసిందని ఆయన అన్నారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో సాయి తేజ ట్రాఫిక్ పోలీసుల సహాయం కోరాడు.

తల్లిని హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాయి తేజ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేశారు. కంట్రోల్ రూం ద్వారా సమాచారం ఇచ్చిన పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి అన్ని రకాలగా సహకరించారు. పోలీసులు ట్రాఫిక్‌ను సరిచేసి ఆసుపత్రికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల రోగిని ఆసుపత్రికి తరలించడానికి పోలీసులకు వీలు పడింది.

NOTE : ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Article Published On: Sunday, December 13, 2020, 6:30 [IST]
English summary
Traffic Cops Helps Techie To Take His Mom To Hospital On Two Wheeler. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+