Just In
- 51 min ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 4 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 6 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 9 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కేసీఆర్ భరోసా: 22 నుంచి బస్సు యాత్రతో జనంలోకి
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు ట్రాఫిక్లో చిక్కుకున్న కొడుకు.. తర్వాత ఏం జరిగిందంటే ?
భారతదేశంలో వాహనాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. వాహనాలు పెరుగుతున్న కొద్దీ దేశ వ్యాప్తంగా ఉన్న రోడ్లు మాత్రమే విస్తరించడం లేదు. రోడ్లను విస్తరించకపోవడం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ కి కారణమవుతుంది. కొన్నిసార్లు అంబులెన్సులు వంటి అత్యవసర వాహనాలు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటాయి.
ట్రాఫిక్ సమస్యకు కేవలం వాహనాలు మాత్రమే కాదు నిరసనలు కూడా కారణమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశ రాజధాని నగరం ఢిల్లీలో రైతులు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ కారణంగా ఢిల్లీ నగరంలో ఎక్కువ ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ట్రాఫిక్ ని మళ్లించడానికి అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారుభారతీ బంద్కు రైతులు పిలుపునివ్వడంతో నిరసనకారులు రోడ్లను అడ్డుకున్నారు, ఫలితంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ మరింత ఎక్కువైంది.
ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో భారత్ బంద్ సందర్భంగా ఒక యువకుడి తల్లి అనారోగ్యానికి గురైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్ అందుబాటులో లేదు. దీంతో ఆ యువకుడు తన తల్లిని ద్విచక్ర వాహనంలో డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు.
MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?
కానీ భారత్ బంద్ కారణంగా వచ్చిన నిరసనలు భారీ ట్రాఫిక్ రద్దీని కలిగించాయి. ఆ యువకుడు అతని తల్లి ట్రాఫిక్లో చిక్కుకున్నారు. యువకుడి తల్లి ఆరోగ్యం క్షీణించడాన్ని పోలీసులు గమనించి, ఆ యువకుడి సహాయానికి ముందుకు వచ్చారు.
సాయి తేజ అనే యువకుడి తల్లి భారతి ఉదయం 9 గంటలకు మూర్ఛ పోయింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రి అంబులెన్స్కు ఫోన్ చేశాడు. మళ్ళీ కాల్ చేసినప్పుడు రోగిని తీసుకురాబోతున్నట్లు అంబులెన్స్ తెలిపింది. సాయి తేజ అనేక హాస్పిటల్స్ యొక్క అంబులెన్స్లకు కాల్ చేసాడు. అంబులెన్స్ లు అందుబాటులో లేకపోవడం వల్ల అతని తల్లిని ద్విచక్ర వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]
కానీ నిరసన వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీ గురించి ఆయనకు తెలియదు. దీంతో అతడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నాడు. దీని గురించి సాయి తేజ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం వల్ల ట్రాఫిక్ జామ్ జరిగి ఉండవచ్చని అనుకున్నానని చెప్పాడు. కానీ నిరసన కారణంగా వాహనాలు కదలడం లేదని తరువాత తెలిసిందని ఆయన అన్నారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో సాయి తేజ ట్రాఫిక్ పోలీసుల సహాయం కోరాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సాయి తేజ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సహాయం చేశారు. కంట్రోల్ రూం ద్వారా సమాచారం ఇచ్చిన పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి అన్ని రకాలగా సహకరించారు. పోలీసులు ట్రాఫిక్ను సరిచేసి ఆసుపత్రికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీనివల్ల రోగిని ఆసుపత్రికి తరలించడానికి పోలీసులకు వీలు పడింది.
MOST READ:రోడ్డెక్కనున్న 50 కొత్త సిఎన్జి బస్సులు.. ఎక్కడో తెలుసా..?
NOTE : ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే