Just In
- 11 hrs ago
ల్యాండ్ రోవర్పై ప్రేమ; అంతిమ యాత్రకు కూడా అదే.. ఇది ఒక రాజు కోరిక
- 13 hrs ago
భారత్లో విడుదలైన ఫోక్స్వ్యాగన్ కొత్త వేరియంట్; ధర & వివరాలు
- 15 hrs ago
బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160పై చేతులు వదిలేసి వీలీ, వరల్డ్ రికార్డ్ బ్రేక్!
- 16 hrs ago
ఇదే అత్యంత చవకైన హీరో బైక్; ధర కేవలం రూ.49,400 మాత్రమే..!
Don't Miss
- Movies
‘ఆరెంజ్’ మూవీ నష్టాలపై తొలిసారి నాగబాబు కామెంట్స్: ఆ అప్పులు ఆయనే తీర్చాడు.. చరణ్ విషయంలో అలా!
- News
రెండోరోజు వైఎస్ షర్మిల నిరాహార దీక్ష..కంటిన్యూ: తెల్లవారు జాము నుంచే దీక్షా శిబిరంలో
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : మిధున రాశి వారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది...!
- Sports
RR vs DC: సిక్స్లతో చెలరేగిన రూ.16.25 కోట్ల ఆటగాడు.. రాజస్థాన్ అద్భుత విజయం!
- Finance
భారీగా షాకిచ్చిన పసిడి, రూ.630 పెరిగి రూ.47,000 క్రాస్: వెండి రూ.1100 జంప్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే మోటారిస్టులకు పోలీసులు భారీ జరిమానాలతో సమాధానం చెబుతున్నారు. ఇలాంటి వారి నుండి కేవలం రెండు గంటల వ్యవధిలోనే అత్యధికంగా రూ.29.5 లక్షల జరిమానాలను వసూలు చేశారు బెంగుళూరు పోలీసులు.

బెంగుళూరు నగర వీధుల్లో ‘ఆపరేషన్ సర్ప్రైజ్ చెక్' పేరిట ట్రాఫిక్ పోలీసులు మోటార్ వాహన తనిఖీలను నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను విధించారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్లో కేవలం రెండు గంటల వ్యవధిలో దాదాపు రూ.29.5 లక్షల జరిమానాలను వసూలు చేశారు.

ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చాలా మంది మోటారిస్టులు హెల్మెట్ ధరించకుండా బైక్లు నడపడం, వన్ వే వీధుల్లో వ్యతిరేక దిశలో ప్రయాణించడం, సేఫ్టీ సీట్ బెల్టులు ధరించకుండా డ్రైవింగ్ చేయడం, డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా రైడ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడటం మరియు పేవ్మెంట్లపై ప్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
MOST READ:నిర్మానుష్య రోడ్డుపై వెళ్తున్నారా.. అయితే టేక్ కేర్.. ఎందుకో వీడియో చూడండి

గత సోమవారం నగరంలోని 178 ప్రదేశాలలో ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య బెంగుళూరు నగర ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించారు.

ఇందులో 44 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొని 6,247 కేసులను నమోదు చేశారు. ఈ కేసుల ద్వారా రూ.29,47,50 జరిమానాలను వసూలు చేసినట్లు జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) బిఆర్ రవికాంత్ గౌడ తెలిపారు.

బిఆర్ రవికాంత్ గౌడ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక డ్రైవ్ను ఇదివరకు ట్రాఫిక్ ఉల్లంఘనలను తనిఖీ చేయని ప్రదేశాలలో నిర్వహించామని, అలాంటి ప్రాంతాల్లో మోటారిస్టులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు కాబట్టే ఇంత అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, నగరంలో ఇలాంటివి 178 ప్రదేశాలను గుర్తించామని ఆయన చెప్పారు.

నగరంలో ఉల్లంఘనలను నియంత్రించడానికి రానున్న రోజుల్లో కూడా ఇలాంటి సర్ప్రైజ్ చెక్లను చేస్తామని, నిబంధనలు అతిక్రిమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రవికాంత్ చెప్పారు.
MOST READ:మళ్ళీ ప్రారంభం కానున్న సీప్లేన్ సర్వీస్.. ఎప్పటినుండో తెలుసా ?

ఇదిలా ఉంటే, డిసెంబర్ 13 నుండి 19 మధ్య కాలంలో బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు 78,754 కేసులను నమోదు చేసి, మోటారిస్టుల నుండి వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనల క్రింద రూ.4,02,07,200 జరిమానాలను వసూలు చేశారు.