Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజెన్ కూడా ఉంది!
భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా మారింది. గతేడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరియు మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలోని చాలా ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజెన్ దొరకడం లేదు.
ఈ పరిస్థితుల్లో భారతీయ రైల్వే సంస్థ గతేడాది మాదిరిగానే, ఈసారి కూడా కరోనా పేషెంట్ల కోసం ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసింది. రైలు బోగీల్లో కరోనా పేషెంట్లకు కావల్సిన చికిత్సను అందించేందుకు వీటిని ప్రత్యేకంగా కస్టమైజ్ చేశారు.
కోవిడ్ కేర్ కోచ్ మార్చిన ఈ రైళ్లలో సుమారు 64,000 పడకలు ఉన్నాయి. కరోనా రోగుల కోసం భారత రైల్వే మంత్రిత్వ శాఖ సుమారు 4000 కోవిడ్ కేర్ కోచ్లను సిద్ధం చేస్తోంది. వీటిని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చు.
MOST READ:సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే
ప్రస్తుతం 169 బోగీలను కోవిడ్ కేర్ కోసం వివిధ రాష్ట్రాలకు అప్పగించారు, మిగిలిన వాటిని ఇంకా సిద్ధం చేస్తున్నారు. కోవిడ్ కోచ్ల కోసం కొత్త డిమాండ్ నాగ్పూర్ జిల్లా నుండి వచ్చింది, భారతీయ రైల్వేస్ వారికి 11 కోచ్లను డెలివరీ చేయనుంది.
ఇందులోని ప్రతి కోచ్లో 16 మంది కరోనా రోగులకు సేవలు అందించే సామర్థ్యం ఉంటుంది. ఈ కోచ్లలో స్లీపర్ సీట్లను సవరించారు. మధ్య వరుసలో సీట్లను తొలగించారు. అలాగే సైడ్ సీట్ను కూడా తొలగించి దాని స్థానంలో ఆక్సిజెన్ సిలిండర్లను అమర్చారు.
కోవిడ్-19 పేషెంట్ల కోసం తయారు చేసిన ఈ కోచ్లలో అవసరమైన వైద్య పరికరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. అలాగే వీటిలో శానిటైజేషన్ మరియు క్యాటరింగ్ కోసం ఏర్పాట్లు కూడా చేయబడతాయి.
MOST READ:కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజెన్ కూడా ఉంది!
దీనితో పాటు, మహారాష్ట్రలో ఆ రాష్ట్ర డిమాండ్ మేరకు అజ్ని ఐసిడి ఏరియాలో ఓ ఐసోలేషన్ కోచ్ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ కొత్త ప్రాంతంతో పాటు, ఢిల్లీ, యూపి, ఎమ్పి మరియు మహారాష్ట్రలోని తొమ్మిది ప్రధాన స్టేషన్లలో కోవిడ్ కేర్ కోచ్లను ఏర్పాటు చేయనున్నారు.
మహారాష్ట్రలోని నందర్లో ప్రస్తుతం 57 మంది రోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగిస్తున్నారు. ఢిల్లీలో 1200 పడకల సామర్థ్యంతో 75 కోవిడ్ కేర్ కోచ్లు అభివృద్ధి చేయబడ్డాయి. మధ్యప్రదేశ్లోని రత్లాంలో 2 కోచ్లు, ఇండోర్లోని 20 బోగీలను ఈ ప్రయోజనం కోసం సిద్ధం చేశారు.
MOST READ:కార్లలో ఎల్ఈడి లైట్స్ ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు!
యుపిలో ప్రస్తుతం 10 బోగీలు సిద్ధంగా ఉన్నాయి, కాని రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఉపయోగించడం లేదు. ఈ ఆధునిక రైల్వే కోచ్లలోని అన్ని సౌకర్యాలు చేతులు ఉపయోగించాల్సిన అవసరం లేని విధంగా రూపొందించబడ్డాయి.
ఈ ఆధునిక కోచ్లను తయారుచేసే సమయంలో, ఉద్యోగులు సామాజిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్నారు. గత సంవత్సరంలో కూడా కరోనా రోగుల కోసం ఇలాంటివి వేలాది బోగీలు తయారు చేశారు. అయితే, ఆ సమయంలో వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోయారు.