Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా ఎఫెక్ట్ : ఐసోలేషన్ వార్డులుగా మారిన ట్రైన్ బోగీలు
చైనాలో పుట్టిన కరోనావైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 24,000 మందికి పైగా ప్రజలు మరణించారు. 4 లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు.
ఈ కరోనా వైరస్ వల్ల రోజు రోజుకు చనిపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో కూడా కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ అంటు వ్యాధికి చికిత్స చేయడానికి ఐసియు మరియు ఐసోలేషన్ వార్డులు అవసరం. కానీ పెరుగుతున్న రోగులకు ఇలాంటి సదుపాయాలు సరిపోకపోవడంతో రైల్వే శాఖ రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు.
రైల్వే శాఖ ప్రతి బోగీని ఒక వార్డులుగా మార్చింది. బోగీల్లోని సీట్లన్నీ తొలగించబడ్డాయి. దిగువ సీట్లు మాత్రమే వున్నాయి. అంతే కాకుండా బోగీలలో అనేక మార్పులు కూడా చేయబడ్డాయి.
కరోనా వైరస్ బాధితులకు చికిత్స చేసే నర్సులకు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలకు ఈ బోగీలలో స్థలాలు ఇవ్వబడతాయి. అదనంగా ప్రతి వార్డులో మరింత భద్రతను పెంచడానికి భద్రతా సామగ్రి కర్టెన్లు కూడా తయారు చేయడం జరిగింది.
బోగీలలోని స్నానపు గదులు కూడా మాడిఫై చేయబడ్డాయి. ఐసోలేషన్ వార్డులుగా మార్చబడిన ఈ రైలు చిత్రాలు ఇటీవల మీడియాలో వచ్చాయి. రైళ్లను పూర్తిగా ఇప్పుడు నిలిపివేయడం వల్ల ఇవి ప్రజలకు వాటిని సింగిల్ వార్డులుగా మార్చవలసి వచ్చింది.
మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా రైలు కార్యకలాపాలను నిలిపివేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ వ్యవధిని ఏప్రిల్ 14 వరకు పొడిగించే అవకాశం ఉంది.
ఇప్పుడు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లలో రైళ్లు కదులుతున్నాయి. ఆ రైళ్లను కూడా ఈ విధంగా ఉపయోగించవచ్చు. బుక్ చేసుకున్న వ్యక్తులు తమ రైలు టిక్కెట్లను రద్దు చేయాలని ఐఆర్సిటిసి ఇటీవల తెలిపింది.
MOST READ:కరోనా గుడ్ న్యూస్: సూపర్ ఫాస్ట్ టెస్టింగ్ కిట్ సిద్దం చేసిన బాష్
బుకింగ్లను రద్దు చేసిన వ్యక్తుల యొక్క డబ్బు పూర్తిగా తిరిగి చెల్లించబడుతుంది. కౌంటర్ల నుండి కొనుగోలు చేసిన టికెట్లను జూన్ నాటికి రద్దు చేయవచ్చు.
MOST READ:కొత్త సిబిఆర్ 250 ఆర్ఆర్ బైక్ను ఆవిష్కరించిన హోండా
కరోనా వైరస్తో పోరాడటానికి ఆటో మొబైల్ కంపెనీలు కూడా ప్రభుత్వంతో చేతులు కలిపాయి. మహీంద్రా, మారుతి, బజాజ్ వంటి సంస్థలు వెంటిలేటర్ల ఉత్పత్తిని ప్రారంభించాయి.
MOST READ :భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ ఇకపై 5 డోర్స్ లో కూడా
భారతదేశంలో అధికంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ నివారణకు భరత ప్రభుత్వానికి ప్రయివేటు కంపెనీలు కూడా మద్దతు తెలియజేస్తూ వైద్య సదుపాయాలకు కావలసిన వాటిని తయారు చేస్తుంది.