Just In
- 3 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 4 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 5 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 6 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏనుగులను రక్షించడానికి ట్రైన్ ఆపేసిన లోకో పైలెట్; ఎక్కడో తెలుసా ?
కొంతకాలం క్రితం హైస్పీడ్ లో వెళ్లే రైలు యొక్క స్థిరత్వం గురించి తెలియజేయడానికి రైల్వే డిపార్ట్మెంట్ నీటి పరీక్ష చేసింది. ఇప్పుడు రైల్వే, వినియోగదారుల వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కొత్త వీడియోను అప్లోడ్ చేశారు.
ఈ వీడియోలో అర్థరాత్రి ఒక రైలు ఒక ట్రాక్పై నిలబడి ఉండటం మరియు కొన్ని ఏనుగులు రైల్వే ట్రాక్ను దాటుతుండటం మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లోని శివోక్-గుల్మా విభాగానికి సమీపంలో జరిగిందని మంత్రి పియూష్ గోయల్ సమాచారం ఇచ్చారు.
రైలు ముందు మూడు ఏనుగులు అకస్మాత్తుగా రావడం ఈ వీడియోలో చూడవచ్చు, ఈ కారణంగా లోకో పైలట్ రైలును ఆపుతాడు. ఈ మూడు ఏనుగులలో ఒక చిన్న పిల్ల ఏనుగు కూడా ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను పియూష్ గోయల్ తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేశారు.
MOST READ:భారీస్థాయిలో వాహన రద్దీ ఏర్పడటానికి కారణం ఇదే
వీడియోను పంచుకున్న పియూష్ గోయల్, "లోకో పైలట్ మరియు సిబ్బంది యొక్క అప్రమత్తత మరియు సత్వర చర్య వల్ల పశ్చిమ బెంగాల్ లోని సివోక్-గులాం విభాగంలో క్రాస్ రైల్ ట్రాక్స్లో మూడు ఏనుగుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడింది" అని రాశారు.
"ఏనుగులు సురక్షితంగా అవతలి వైపుకు వెళ్లే వరకు రైలుని ఆపి ఉంచారు, అని ఆయన రాశారు. కొంతకాలం ముందు, భారత రైల్వే మంత్రిత్వ శాఖ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను విడుదల చేసింది.
MOST READ:యజమాని డ్రైవింగ్ సమయంలో రివర్స్ పార్కింగ్ కెమెరాలాగ పనిచేస్తున్న పెంపుడు కుక్క [వీడియో]
ఈ వీడియోలో, రైలు లోపల ఒక గాజు గ్లాసు నీటితో నిండి ఉంది. కానీ రైలు వేగంగా కదుతుంది, దీని తరువాత కూడా గాజు గ్లాసు నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయట పడలేదు. ఈ వీడియో ఇప్పటికే చాలామంది ప్రశంసలు అందుకుంది. ఇది రైల్వే డిపార్మెంట్ గర్వించదగ్గ విషయం.
ఈ వీడియోను పంచుకుంటూ, రైల్వే మంత్రిత్వ శాఖ "భారత రైల్వే చేసిన మా ఇంటెన్సివ్ ట్రాక్ నిర్వహణకు ఈ వీడియో నిలువెత్తు నిదర్శనం. రైల్వేలో ప్రయాణం చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైలు ప్రయాణం నిజంగా లగ్జరీ అనుభవాన్ని ఇస్తుంది. దీనికి సాక్ష్యమే గాజు గ్లాసు యొక్క నీటి పరీక్ష.
MOST READ:వచ్చే 7 సంవత్సరాలలో 28 కొత్త బైక్లను పరిచయం చేయనున్న రాయల్ ఎన్ఫీల్డ్