భారీ ట్రక్కును ఢీ కొన్న రైలు: తప్పెవరిది ?
ప్రమాదాలలో మనల్ని బాగా కలచి వేస్తున్నవి రైలు ప్రమాదాలు. ఈ ప్రమాదాలకు దాదాపుగా రైలు నడుపుతున్న వారి అజాగ్రత్త ఏ మాత్రం ఉండదు. మన నిర్లక్ష్యం వలనే రైళ్ల ద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం. మన దేశంలో చాలా వరకు లెవల్ క్రాసింగ్ల వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందు కోసం భారతీయ రైల్వే ఇప్పుడు అన్ని రైల్వే గేటులను ను తొలగించి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ద్వారా రవాణాను కల్పిస్తున్నారు.
ఇది మన దేశంలో, కాని బాగా అభివృద్ది చెందిన దేశాలలో ఏ మాత్రం భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వలన ఆశ్చర్యకరమైన రీతిలో రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనం ఈ కథనం....

మొదటి తప్పు, ఇక్కడ ఉన్న రోడ్లను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. కాని ఈ లెవల్ క్రాసింగ్ వద్ద ఏ మాత్రం కూడా భద్రత ప్రమాణాలను పాటించలేదు. అదేనండి రైల్వే గేటును ఏర్పాటు చేయలేదు.

ఇక్కడ చూడండి ఒక భారీ ట్రక్కును వేసుకుని ఈ రైల్వే గేటును దాటడాని ప్రయత్నిస్తున్నాడు. రెడ్ సిగ్నల్ పడిన తరువాత కూడా ఇంతటి ట్రక్కును ఆ పట్టాల మీదగా క్రాస్ చేస్తానని ఎలా అనుకున్నాడో ఏమో మరి.

రెడ్ సిగ్నల్ పడిన తరువాత కూడా ఇలా క్రాస్ చేస్తుండగా డ్రైవర్ క్యాబిన్ ఇలా పట్టాల మీద ఉంది. ట్రైన్ వస్తుందని తెలిసి కూడా ఇంతటి ప్రయత్నానికి తెర తీశాడంటే చావుకు భయపడని వ్యక్తి అయినా అయి ఉండాలి, లేదంటే మధ్యం మత్తులో అయినా ఉండాలి.

ఇక చేసేదేముంది. ట్రైన్ రావడం జరిగింది. ట్రక్కుని ఢీ కొట్టడం జరిగింది. దీనికి కారణం ఎవరు ? రైల్వే గేటును ఏర్పాటు చేయని ఆ దేశ రైల్వే విభాగానిదా లేకపోతే రెడ్ సిగ్నల్ పడిన తరువాత కూడా పట్టాలు దాటడానికి ప్రయత్నించిన డ్రైవర్దా ?

లారి క్యాబిన్ ట్రక్కును లాక్కుంటు వెళ్తుండటం వలన పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ట్రక్కు, క్యాబిన్ విడిపోవడం వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

మీరు ఎప్పుడైనా రైల్వే గేటును దాటుతున్నపుడు పట్టాల మీద రెండు వైపులా గమనించి. రైలు రాలేదని నిర్థారించుకున్న తరువాత ముందుకు వెళ్లండి.

ఈ రైలు ప్రమాదానికి చెందిన వీడియో కథనం చివరలో కలదు.

- గోపాలుడి బైక్ 'ఆక్విలా 650'
- ఓరి నీ కారు మైదానం కాను...!! మీకు ఇలాంటి కారు కావాలా?
- జస్ట్ మిస్.. లేకుంటే..


Click it and Unblock the Notifications








