Just In
- 8 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 9 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 10 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ కారణంగా వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు ఎక్కువగా ఉన్నాయి, కావున ఒక్కసారికా వాటిని వదిలివేయడం సాధ్యమయ్యేపని కాదు. అందుకోసం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని వాహనదారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ టాక్స్, వ్యాట్ తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాహనదారులు పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు.
ఇటీవల త్రిచిలో కొత్తగా ఓపెన్ చేసిన బేకరీలో ఒక కొత్త విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ విధానం ప్రకారం ఈ బేకరీలో ఒక కేజీ కేక్ కొనుగోలు చేస్తే, 1 లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇవ్వబడుతుంది. ఈ బేకరీ ఓనర్ సాగైరాజ్ ఈ విధానం ద్వారా ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నారు. కొత్తగా తెరిచిన బేకరీ కావున ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.
MOST READ:అక్రమ బిఎస్4 కార్లను విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు; హైదరాబాద్లో కూడా మూలాలు!
బేకరీ ప్రారంభోత్సవంలో బేకరీ యజమాని సాగిరాజ్ ఈ ఆఫర్ గురించి మాట్లాడుతూ, పెట్రోల్ ధరలు ఇప్పుడు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో పెట్రోల్ ఉచితంగా ఇస్తే వినియోగదారులకు కొంతవరకు ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ ఆఫర్లు వినియోగదారులకు చాలా ప్రయోజనం చేకూర్చుతుంది, ఒక కిలో కేక్ కొనుగోలు చేసిన వారికి 1 లీటర్ ఉచిత పెట్రోల్ ఆఫర్ లభిస్తుందని తెలిపారు. పెట్రోల్ మరియు డీజిల్ ఉచితంగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో, చాలా బేకరీలు ఈ విధమైన ఆఫర్లను ప్రకటిచింది.
పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరిగిపోవడం వల్ల ఇటీవల చలమాది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయడానికి ముందుకు వస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుచేసేవారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాయితీలు కూడా కల్పిస్తున్నారు.
పెట్రోల్ను బేకరీలలోనే కాకుండా కొన్ని సమావేశాల్లోనూ మరియు వేడుకలోనూ బహుమతిగా అందిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ పెట్రోల్తో బహుమతిగా ఇచ్చి అనాద్రి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
MOST READ:అడవి ఏనుగు భారినుంచి తృటిలో తప్పించుకున్న ప్రముఖ సింగర్ [వీడియో]
Source: Behindwoods