Just In
- 36 min ago Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- 2 hrs ago కదిలే ఇంద్రభవనమా? ఏంటిది మరి!.. వీడియో చూడాల్సిందే
- 3 hrs ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 4 hrs ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
Don't Miss
- News మోదీ మార్క్ పాలిటిక్స్: బీజేపీకి రాం రాం: కేంద్ర మంత్రి రాజీనామా
- Finance Patanjali: బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్.. షేర్ల పతనం..!
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Movies యాంకర్లను వెనక్కి నెట్టిన కమెడియన్లు.. అందరుమెచ్చిన బుల్లితెర నటుల్లో టాప్ 5 వీళ్లే!
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Lifestyle ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్.. ఏం చేసారో తెలుసా?
భారతదేశంలో ప్రతి సంవత్సరం లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే కాదు. సరైన రోడ్లు లేకపోవడం కూడా. భారతదేశంలో రోడ్లు కొన్ని ప్రాంతాల్లో మరీ దీనస్థితిలో ఉన్నాయి. ఇలాంటి రోడ్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఇలాంటి రోడ్ల వల్ల ఎక్కువ ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ముంబై వంటి మహా నగరాల్లో ఇలాంటి సమస్యలు తెలెత్తుతాయి. ముంబైలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రోడ్బ్లాక్లను మూసివేసిన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు కానిస్టేబుళ్లు సకాలంలో అక్కడ ఉండటం వల్ల ఈ రోడ్ బ్లాక్లను మూసివేశారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రోడ్ బ్లాక్లను మూసివేసిన ఫోటోలు సోషల్ నెట్వర్క్లలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన గత మంగళవారం ముంబైలో జరిగినాట్లు నివేదికల ద్వారా తెలిసింది.
సంజయ్ వాగ్, సాహెబ్రూ చవాన్ ముంబైలో ఈ రోడ్ బ్లాక్ మూసివేసిన కానిస్టేబుళ్లు. ఈ ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతల కారణంగా ట్రాఫిక్ జామ్ అవడాన్ని గమనించారు. వారు వెంటనే సంబంధిత సిబ్బంది మరియు అధికారులకు సమాచారం ఇచ్చారు.
ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అందించిన సమాచారం తరువాత కూడా అక్కడికి ఎవరూ రాలేదు. అయితే ఈ సమస్యను వారే పరిష్కరించాలనుకుని, సమీపంలో నిర్మాణ పనులు జరిగే ప్రదేశం నుంచి రోడ్బ్లాక్లను మూసివేయడానికి అవసరమైనవాటిని తీసుకువచ్చి దానిని మూసివేశారు.
ట్రాఫిక్ కానిస్టేబుళ్లు చూపిన ఈ చొరవతో వాహనాలు సజావుగా ముందుకు సాగాయి. ఈ ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల చేసిన పనికి అందరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ముంబైలో ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తాయి. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షం కురుస్తోంది.
ఈ సమస్య ముంబైలోనే కాదు, భారతదేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, రోడ్డు నిర్మించేవారు లాభం పొందడానికి తక్కువ ఖర్చుతో, తక్కువ నాణ్యత గల రహదారులను నిర్మిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇది రాబోయే రోజుల్లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తుంది. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వాలు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి.
Source: Free Press Journal