Just In
- 7 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 9 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 12 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 13 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ట్రాఫిక్ కానిస్టేబుల్స్ చేసిన పనికి ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్స్.. ఏం చేసారో తెలుసా?
భారతదేశంలో ప్రతి సంవత్సరం లెక్కకు మించిన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడమే కాదు. సరైన రోడ్లు లేకపోవడం కూడా. భారతదేశంలో రోడ్లు కొన్ని ప్రాంతాల్లో మరీ దీనస్థితిలో ఉన్నాయి. ఇలాంటి రోడ్ల వల్ల ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఇలాంటి రోడ్ల వల్ల ఎక్కువ ట్రాఫిక్ కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా ముంబై వంటి మహా నగరాల్లో ఇలాంటి సమస్యలు తెలెత్తుతాయి. ముంబైలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రోడ్బ్లాక్లను మూసివేసిన సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు కానిస్టేబుళ్లు సకాలంలో అక్కడ ఉండటం వల్ల ఈ రోడ్ బ్లాక్లను మూసివేశారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రోడ్ బ్లాక్లను మూసివేసిన ఫోటోలు సోషల్ నెట్వర్క్లలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సంఘటన గత మంగళవారం ముంబైలో జరిగినాట్లు నివేదికల ద్వారా తెలిసింది.
సంజయ్ వాగ్, సాహెబ్రూ చవాన్ ముంబైలో ఈ రోడ్ బ్లాక్ మూసివేసిన కానిస్టేబుళ్లు. ఈ ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రోడ్డు మధ్యలో ఉన్న పెద్ద గుంతల కారణంగా ట్రాఫిక్ జామ్ అవడాన్ని గమనించారు. వారు వెంటనే సంబంధిత సిబ్బంది మరియు అధికారులకు సమాచారం ఇచ్చారు.
ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అందించిన సమాచారం తరువాత కూడా అక్కడికి ఎవరూ రాలేదు. అయితే ఈ సమస్యను వారే పరిష్కరించాలనుకుని, సమీపంలో నిర్మాణ పనులు జరిగే ప్రదేశం నుంచి రోడ్బ్లాక్లను మూసివేయడానికి అవసరమైనవాటిని తీసుకువచ్చి దానిని మూసివేశారు.
ట్రాఫిక్ కానిస్టేబుళ్లు చూపిన ఈ చొరవతో వాహనాలు సజావుగా ముందుకు సాగాయి. ఈ ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల చేసిన పనికి అందరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ముంబైలో ప్రతి సంవత్సరం భారీ వర్షాలు కురుస్తాయి. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షం కురుస్తోంది.
ఈ సమస్య ముంబైలోనే కాదు, భారతదేశంలోని వివిధ నగరాల్లో కూడా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, రోడ్డు నిర్మించేవారు లాభం పొందడానికి తక్కువ ఖర్చుతో, తక్కువ నాణ్యత గల రహదారులను నిర్మిస్తున్నారు. ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఇది రాబోయే రోజుల్లో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గిస్తుంది. రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి ప్రభుత్వాలు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి.
Source: Free Press Journal