Just In
- 30 min ago
కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల
- 52 min ago
సైనికుల కోసం బుల్లెట్ బైక్లనే మొబైల్ అంబులెన్స్లుగా మార్చేశారు..
- 2 hrs ago
3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి
- 2 hrs ago
దేశంలోనే అతిపెద్ద మల్టీ-బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్ను ఓపెన్ చేసిన బాష్
Don't Miss
- Movies
Box office: 5వ రోజు రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్.. రామ్ టార్గెట్ ఫినిష్.. ఇంకా పైకిరాని బెల్లంకొండ
- Sports
Brisbane Test: పంత్ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా భారత్!! కొట్టాల్సింది 59 పరుగులే!
- News
బీజేపీ రథయాత్ర సవాల్- కౌంటర్ వ్యూహానికి పదును పెడుతున్న జగన్- అమిత్షా దృష్టికి ?
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్ల భారీ జంప్, రిలయన్స్ రూ.2000 మార్క్ క్రాస్
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రేకింగ్ న్యూస్.. ఉబర్తో కలిసిపోయిన ఫ్లిప్కార్ట్, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ కారణంగా వాహన సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.

భారతదేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల క్యాబ్ సేవా సంస్థ ఉబర్ మరియు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ వృద్ధులకు మరియు ఇంటి నుండి బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో అవసరమైన సామాగ్రి లేకపోవటం గురించి ఆందోళన చెందుతున్న వారికి సహాయం చేయడానికి ముందడుగు వేసాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజల అవసరాలను తీర్చడానికి రెండు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.

ఈ కంపెనీలు అవసరమైన వస్తువులను బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలోని వినియోగదారులకు పంపిణీ చేస్తాయి. దీని ప్రకారం ఉబర్ ప్రజల ఇళ్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. దీని కోసం వినియోగదారులకు ఎటువంటి అదనపు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.

లాక్ డౌన్ వల్ల డెలివరీ సిబ్బంది కొరత కారణంగా, ప్రజలు కిరాణా, పండ్లు, కూరగాయలు, పాలు వంటి అవసరమైన వస్తువులను సరఫరా చేయలేకపోతున్నారు. ఉబర్ మరియు ఫ్లిప్కార్ట్ వస్తువులను డోర్ డెలివరీ చేయడానికి సిద్దమైనది.

వస్తువులను సరఫరా చేయడం మాత్రమే కాకుండా అదనంగా, సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు మరియు శానిటైజర్లు అందించబడతాయి. లాక్ డౌన్ వంటి కష్ట సమయాల్లో తమ వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.

సంస్థ తన వినియోగదారులందరికీ అవసరమైన వస్తువులతో సేవ చేయడానికి అన్ని ఎంపికలను సేకరిస్తోంది. ఇప్పటికే సంస్థ అన్ని అవసరమైన వస్తువుల పంపిణీని చేయడం ప్రారంభించింది. అంతే కాకుండా ఈ సేవలకు వినియోగదారుల నుండి అదనపు రుసుము వసూలు చేయదని కూడా స్పష్టం చేసింది.

భారతదేశంలో లాక్ డౌన్ వల్ల చాలా క్లిష్టమైన సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో ఉబర్ మరియు ఫ్లిప్కార్ట్ రెండూ భాగస్వామ్యం అవ్వడం వల్ల చాల వరకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఏది ఏమైనా ఎట్టకేలకు ఈ సంస్థలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.