Just In
- 1 hr ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 4 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 5 hrs ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 6 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- News రాజీనామాకు సిద్దం - కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
బ్రేకింగ్ న్యూస్.. ఉబర్తో కలిసిపోయిన ఫ్లిప్కార్ట్, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ కారణంగా వాహన సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
భారతదేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల క్యాబ్ సేవా సంస్థ ఉబర్ మరియు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ వృద్ధులకు మరియు ఇంటి నుండి బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో అవసరమైన సామాగ్రి లేకపోవటం గురించి ఆందోళన చెందుతున్న వారికి సహాయం చేయడానికి ముందడుగు వేసాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజల అవసరాలను తీర్చడానికి రెండు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.
ఈ కంపెనీలు అవసరమైన వస్తువులను బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలోని వినియోగదారులకు పంపిణీ చేస్తాయి. దీని ప్రకారం ఉబర్ ప్రజల ఇళ్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. దీని కోసం వినియోగదారులకు ఎటువంటి అదనపు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.
లాక్ డౌన్ వల్ల డెలివరీ సిబ్బంది కొరత కారణంగా, ప్రజలు కిరాణా, పండ్లు, కూరగాయలు, పాలు వంటి అవసరమైన వస్తువులను సరఫరా చేయలేకపోతున్నారు. ఉబర్ మరియు ఫ్లిప్కార్ట్ వస్తువులను డోర్ డెలివరీ చేయడానికి సిద్దమైనది.
వస్తువులను సరఫరా చేయడం మాత్రమే కాకుండా అదనంగా, సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు మరియు శానిటైజర్లు అందించబడతాయి. లాక్ డౌన్ వంటి కష్ట సమయాల్లో తమ వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
సంస్థ తన వినియోగదారులందరికీ అవసరమైన వస్తువులతో సేవ చేయడానికి అన్ని ఎంపికలను సేకరిస్తోంది. ఇప్పటికే సంస్థ అన్ని అవసరమైన వస్తువుల పంపిణీని చేయడం ప్రారంభించింది. అంతే కాకుండా ఈ సేవలకు వినియోగదారుల నుండి అదనపు రుసుము వసూలు చేయదని కూడా స్పష్టం చేసింది.
భారతదేశంలో లాక్ డౌన్ వల్ల చాలా క్లిష్టమైన సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో ఉబర్ మరియు ఫ్లిప్కార్ట్ రెండూ భాగస్వామ్యం అవ్వడం వల్ల చాల వరకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఏది ఏమైనా ఎట్టకేలకు ఈ సంస్థలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.