Just In
- 2 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 4 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 5 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports IPL 2024: ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్.. విధ్వంసకర బ్యాటర్ దూరం!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకింగ్ న్యూస్.. ఉబర్తో కలిసిపోయిన ఫ్లిప్కార్ట్, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, దీనిని నివారించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ కారణంగా వాహన సేవలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచించారు.
భారతదేశంలో లాక్ డౌన్ విధించడం వల్ల క్యాబ్ సేవా సంస్థ ఉబర్ మరియు ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ వృద్ధులకు మరియు ఇంటి నుండి బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో అవసరమైన సామాగ్రి లేకపోవటం గురించి ఆందోళన చెందుతున్న వారికి సహాయం చేయడానికి ముందడుగు వేసాయి. లాక్ డౌన్ సమయంలో ప్రజల అవసరాలను తీర్చడానికి రెండు సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.
ఈ కంపెనీలు అవసరమైన వస్తువులను బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలోని వినియోగదారులకు పంపిణీ చేస్తాయి. దీని ప్రకారం ఉబర్ ప్రజల ఇళ్లకు అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. దీని కోసం వినియోగదారులకు ఎటువంటి అదనపు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు.
లాక్ డౌన్ వల్ల డెలివరీ సిబ్బంది కొరత కారణంగా, ప్రజలు కిరాణా, పండ్లు, కూరగాయలు, పాలు వంటి అవసరమైన వస్తువులను సరఫరా చేయలేకపోతున్నారు. ఉబర్ మరియు ఫ్లిప్కార్ట్ వస్తువులను డోర్ డెలివరీ చేయడానికి సిద్దమైనది.
వస్తువులను సరఫరా చేయడం మాత్రమే కాకుండా అదనంగా, సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు మరియు శానిటైజర్లు అందించబడతాయి. లాక్ డౌన్ వంటి కష్ట సమయాల్లో తమ వినియోగదారులకు సహాయం చేయడానికి కంపెనీ కట్టుబడి ఉందని ఫ్లిప్కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
సంస్థ తన వినియోగదారులందరికీ అవసరమైన వస్తువులతో సేవ చేయడానికి అన్ని ఎంపికలను సేకరిస్తోంది. ఇప్పటికే సంస్థ అన్ని అవసరమైన వస్తువుల పంపిణీని చేయడం ప్రారంభించింది. అంతే కాకుండా ఈ సేవలకు వినియోగదారుల నుండి అదనపు రుసుము వసూలు చేయదని కూడా స్పష్టం చేసింది.
భారతదేశంలో లాక్ డౌన్ వల్ల చాలా క్లిష్టమైన సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ సమయంలో ఉబర్ మరియు ఫ్లిప్కార్ట్ రెండూ భాగస్వామ్యం అవ్వడం వల్ల చాల వరకు ప్రయోజనం చేకూరుస్తాయి. ఏది ఏమైనా ఎట్టకేలకు ఈ సంస్థలు తీసుకున్న నిర్ణయం అభినందనీయం.