కరోనా వైరస్ నివారించడానికి ఉబర్ కొత్త ఐడియా
కరోనా వైరస్ దేశం మొత్తం అపారమైన నష్టాన్ని కలిగించింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజించింది. ఈ సమయంలో అత్యవసర వాహనాలతో పాటు ప్రైవేట్ వాహనాలను కూడా అనుమతిస్తారు.

లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంటి నుంచి బయటికి వెళ్లడం లేదు. చాలా మంది తమ సొంత వాహనాలను ఉపయోగించుకుంటున్నారు. ఉబర్ సోమవారం నుండి దేశంలోని 34 నగరాల్లో క్యాబ్ సేవలను ప్రారంభించింది. తన వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి సంస్థ అనేక చర్యలు తీసుకుంది.

ముందు జాగ్రత్త చర్యగా క్యాబ్ కంపెనీలు క్యాబ్ డ్రైవర్లకు ఒకే ట్రిప్ మాత్రమే నడపాలని సూచించాయి. కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా పాటిస్తోంది.

ఉబర్ తన క్యాబ్ డ్రైవర్లను రక్షించడానికి డ్రైవర్ క్యాబిన్ తో ప్లాస్టిక్ షీట్ గోడను నిర్మించింది. ఈ గోడ వల్ల డ్రైవర్ కి మరియు లోపల ఉన్న ప్రయాణికులతో ఎటువంటి సంబంధం లేదు. ఇది పారదర్శక ప్లాస్టిక్ షీట్ ఇది నీటితో కడిగి మళ్ళీ వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

ప్లాస్టిక్ షీట్ గోడ ప్రయాణికులు లోపలికి వచ్చినప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు డ్రైవర్కు ఎలాంటి అపాయం ఉండదు. అంతే కాకుండా ప్రయాణీకులు డ్రైవర్తో సంబంధాలు రాకుండా నిరోధిస్తుందని కంపెనీ తెలిపింది.

కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన క్యాబ్ కంపెనీలు వారి కొన్ని సేవలను నిలిపివేసాయి. క్యాబ్ కంపెనీలు కార్పూలింగ్ సేవను నిలిపివేసాయి. ఇలాంటి క్యాబ్లలోకి వెళ్లడం చాలా సురక్షితంగా ఉంటుంది.

కస్టమర్ మాస్కు ధరించకపోతే ట్రిప్ను రద్దు చేసే అవకాశాన్ని క్యాబ్ కంపెనీలు డ్రైవర్లకు ఇచ్చాయి. అన్ని డ్రైవర్లు క్యాబ్లోని ఎసిలను ఆపివేసి కిటికీలు ఓపెన్ చేయాలనీ ఆదేశిస్తారు. భారతదేశంలో కరోనా నివారించడానికి ఉబర్ ఈ విధమైన కొత్త ఐడియాతో ముందడుగు వేస్తోంది.


Click it and Unblock the Notifications








