మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు 100 రూపాయలు దాటిపోయింది. భారతదేశం అంతటా పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో రూ. 100 మార్కును దాటే అవకాశం కనిపిస్తోంది. ఈ ధరల మంటలు సామాన్య వాహనదారులు తట్టుకోలేకతున్నారు.

మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

పెట్రోల్ మరియు డీజిల్ పెరుగుదల సాధారణ ప్రజల పాలిట శాపంగా మారింది. ఒక్క పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మాత్రమే కాకుండా వంట గ్యాస్ (గ్యాస్) ధర కూడా ఇప్పుడు రూ. 50 లుపెరిగిపోయింది. ఇవన్నీ ప్రజలకు చాలా భారమవుతోంది.

మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతున్న కారణంగా కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ గడ్కరీ, ప్రజలు పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలకు మారాలని అన్నారు. మంత్రి సమాధానం ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది.

మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగేకొద్దీ, అవసరమైన వస్తువుల ధర కూడా పెరుగుతుంది. బస్సు ఛార్జీలు కూడా పెరుగుతాయి. గత కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ చర్యను ప్రజా వ్యతిరేకమని ప్రకటిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ టాక్స్ తగ్గించమని బలవంతం చేశారు కానీ పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్‌పై టాక్స్ పెంచారు. ఇప్పుడు పెట్రోల్‌పై 61%, డీజిల్‌పై 56% టాక్స్ ఉంది. అధిక టాక్సుల కారణంగా పెట్రోల్, డీజిల్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతదేశం నుంచి సమీప దేశమైన శ్రీలంకకు పెట్రోల్ ఎగుమతవుతుంది. అయితే శ్రీలంకలో లీటరు పెట్రోల్ ధర 62 రూపాయలు.

మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

ఇప్పుడు భారతదేశం నుండి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న బంగ్లాదేశ్‌లో ఒక లీటరు పెట్రోల్ ధర 78 రూపాయలు. భారతదేశం నుంచి ఎగుమతైన పెట్రోల్ పక్కదేశాలలో తక్కువ ధరకు విక్రయిస్తుంటే ఎగుమతి చేసిన మన దేశంలో ఇంత ధరకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరిగేకొద్దీ, భారతదేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్‌పై ప్రభుత్వం ప్రత్యేక ఛార్జ్ విధిస్తోంది. చమురు ధరను తగ్గించే ప్రయోజనం దీనికి ఉంది. ఇదిలావుండగా, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని కేంద్ర మంత్రి అన్నారు.

మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కూల్ రియాక్షన్

ఇంధన ధరలు రానున్న రోజుల్లో కూడా ఇలాగే కొనసాగితే ప్రజలు తప్పకుండా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తారు. పెరుగుతున్న పెట్రోల్ ధర సామాన్యుడికి పెనుభారమవుతోంది. కావున దీనిపై ప్రభుత్వం కూడా కొంత చర్య తీసుకోవాలి. అప్పుడే సామాన్యుడు ఈ పెట్రో మంటల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది.

Article Published On: Wednesday, February 17, 2021, 15:31 [IST]
English summary
Union Transport Minister Gives Cool Answer About Fuel Price Hike. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+