Just In
- 5 min ago రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- 14 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 15 hrs ago హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
- 16 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
Don't Miss
- Technology Motorola నుంచి రెండు కొత్త ఇయర్ బడ్స్ లాంచ్! ధర, ఫీచర్లు
- Movies Devara ఎన్టీఆర్ ఫ్యాన్స్ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ చికిత్స కోసం కొత్త ప్లాన్.. ఏంటో తెలుసా?
భారతదేశంలో ప్రతి ఏటా కొన్ని లక్షల మంది రోడ్డుప్రమాదాల వల్ల గాయపడుతున్నారు, అంతే కాదు కొంతమంది ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల విభాగం కొత్త పథకాన్ని ప్రారంభించింది.
ప్రమాదం జరిగినప్పుడు పోలీసులను, అంబులెన్స్లను తక్షణమే అందుబాటులో ఉంచడానికి మెరుగైన ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర రహదారి రవాణా, రహదారుల శాఖ నిర్ణయించింది. ఈ కొత్త అధునాతన ప్రాజెక్టును త్వరలో అమలు చేయనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ కొత్త ప్రణాళిక ప్రకారం, జిపిఎస్ సౌకర్యం ఉన్న అంబులెన్స్ బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు కొత్త ప్రణాళికను అమలు చేస్తున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి గిరిధర్ తెలిపారు.
MOST READ:ఇలయదలపతి విజయ్ ఉపయోగించే లగ్జరీ కార్స్ ఇవే, చూసారా..?
రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స అందించడానికి పోలీసులు, అంబులెన్సులు, ఆసుపత్రులను ఒకే నెట్వర్క్ కిందకు తీసుకువస్తున్నట్లు ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖతో చర్చలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అత్యధిక ప్రమాదాలు నమోదయ్యే దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.50 లక్షల మంది మరణించారు.
ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్య సహాయం అందించలేకపోవడమే మరణాలకు ప్రధాన కారణం. అందుకే రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి ఈ కొత్త ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. అదనంగా, రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది.
MOST READ:ఇలా చేస్తే ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందటం వెరీ సింపుల్
ప్రజల నుంచి ఎక్కువ నిరసనలు వస్తున్నప్పటికీ కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలువిధిస్తున్నారు. ఎందుకంటే అత్యధిక జరిమానాలు విధించడం వల్ల ప్రజలు ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా పాటించే అవకాశం ఉంది.
కొత్త మోటారు వాహన చట్టం 2019 సెప్టెంబర్లో అమల్లోకి వచ్చింది. కొత్త చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుండి భారతదేశం అంతటా రోడ్డు ప్రమాదాల సంఖ్య దాదాపు 3.86% తగ్గింది. కొత్త మోటారు వాహన చట్టానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇంకా అనేక చర్యలు తీసుకుంటోంది.
MOST READ:హైదరాబాద్లో మళ్ళీ ప్రారంభం కానున్న డబుల్ డెక్కర్ బస్ సర్వీస్..ఎప్పుడంటే?
వాహనాల్లో ఎయిర్బ్యాగులు మరియు ఎబిఎస్ వంటి వివిధ భద్రతా పరికరాలను తప్పనిసరి వాడటం వల్ల కూడా ప్రమాదాల సంఖ్య బాగా తగ్గుముఖం పడుతోంది. ఈ భద్రతా పరికరాలు వాహనదారులు భద్రతను పెంచడంలో సహాయపడుతొంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ట్రాఫిక్ నిబంధనలను తప్పని సరిగా వాహనదారులు పాటిస్తే భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఏది ఏమైనా ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ నిజంగా అభినందనీయం. ఈ విధానం వాళ్ళ ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. తద్వారా మరణాల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది.