హెల్మెట్ లేదని ఫైన్.. కోపంతో పోలీస్ స్టేషన్ కరెంటు పీకేసిన ఘనుడు
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించడం ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రవర్తించే తీరు ఆందోళనకరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో హెల్మెట్ పెట్టుకోలేదంటూ చిన్న ఉద్యోగిని ఫైన్ విధించిన పోలీసులు తరువాత ఎంత బతిమాలినా కనికరించలేదు. దీంతో జరిమానా కట్టిన వ్యక్తి ఆ తర్వాత పోలీసులపై ప్రతీకారాన్ని ఏవిధంగా తుర్చుకున్నాడో తెలుసా.. వివరాలలోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లాకు చెందిన ఎలక్ట్రీషియన్, తన మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా హెల్మెట్ ధరించ లేదని రూ.500 ల ఫైన్ వేశారు. అయితే పోలీసులు మాత్రం ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదని, అందుకే రూ.500 కు ఫైన్ జారీ చేశామన్నారు.

ఆ పోలీసు తన జూనియర్ ఇంజనీర్తో మాట్లాడిన్పటికీ, ఏ మాత్రం లాభంలేదు. తన నెలవారీ ఆదాయం కేవలం రూ.6,000 మాత్రమే ఉండటంతో రూ. 500 జరిమానా చెల్లించ లేకపోతున్నట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఎట్టకేలకు ఫైన్ ను ఆన్ లైన్ లో చెల్లించాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ పై పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలను తనిఖీ చేయాలని విద్యుత్ కార్యాలయంలో తన సహచర సిబ్బందిని కోరారు.

తరువాత తెలిసిన విషయం ఏమిటంటే, జనవరి 2016 నుంచి ఇప్పటివరకు రూ.6,62463 మేరకు బిల్లులు పోలీసువారు కట్టవలసి ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని అనుసరిస్తూ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్ కు విద్యుత్ సరఫరాను కట్ చేసాడు.

విద్యుత్ సరఫరాను కట్ చేయడంతో సుమారు 4 గంటల పాటు విద్యుత్ లేకుండా పోలీస్ స్టేషన్ ఉండిపోయింది. విద్యుత్ శాఖ అధికారులతో సీనియర్ పోలీసులు ఈ విషయం తెలుసుకొన్న తర్వాతనే దానిని పునరుద్ధరించారు.

వివరణలు అడిగితే, పెండింగ్ బిల్లుల ఉన్నందువలన ఈ విధంగా చేసానని శ్రీనివాస్ పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం, జరిమానా విధించడం వంటి నిబంధనల గురించి గతంలో పోలీసులు వివరించినా, సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించడంలో ఉన్న నిబంధనలను శ్రీనివాస్ కూడా వివరించి, దాని చెల్లించే విధంగా చేసాడు.

జనవరి 2016 నుంచి బిల్లులు చెల్లించలేని విధంగా ఉండిపోయింది. ఈ విషయాన్ని ఆ తర్వాత సబ్ డివిజనల్ అధికారి, డీవీఎన్ ఎల్ ఫిరోజాబాద్ జిల్లా రణ్ వీర్ సింగ్ ధ్రువీకరించగా, పలు రిమైండర్లు పంపినప్పటికీ ఎటువంటి ఫలితం లేదన్న విషయాన్ని కూడా చెప్పారు.

అయితే అన్ని కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు విద్యుత్ బిల్లుల చెల్లింపు కోసం డీవోఎన్ఎల్ కు రూ. 1.15 కోట్లు చెల్లించామని పోలీసులు పేర్కొన్నారు. బ్యాలెన్స్ కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు.

పోలీస్ స్టేషన్ కు 10 కిలోవాట్ల అదనపు లోడ్ విద్యుత్ వినియోగం తక్కువగా ఉందని పోలీసు అధికారులు ఫిర్యాదు చేశారు, అయితే విద్యుత్ శాఖ ఈ వాదనను బదులుగా, ఇక్కడ ఉపయోగించిన అదనపు ఎక్విప్ మెంట్ వల్ల పీక్ లోడ్ 14 కిలోవాట్ కు చేరుకుంది అని తెలియ చేసారు.

ఈ విషయం అంతటితో ముగియలేదని, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా శ్రీనివాస్ కరెంట్ సరఫరా నిలిపివేయడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పోలీసులు అంటున్నారు.
Source: TOI


Click it and Unblock the Notifications








