Just In
- 6 min ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 3 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
Don't Miss
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Movies లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ దివి... ఓన్లీ మగవారి కోసమే అంటూ!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
కారు పేపర్లు చూపమంటే రోడ్డు మీద పడి ఏడ్చిన అమ్మాయి : వీడియో
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వల్ల కరోనా నియంత్రించడానికి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. కానీ కరోనా అనుకున్న రీతిలో ఫలితం రాకపోవడం వల్ల లాక్ డౌన్ ని 2020 మే 03 వరకు పొడిగించారు. ఇప్పుడు భారతదేశంలో రెండవ దశ లాక్ డౌన్ అమలులో ఉంది.
భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించి దాదాపు ఒక నెల పూర్తయింది. దశలవారీగా పనిని తిరిగి ప్రారంభించడానికి ఉద్యోగులకు లేదా ఐటి మరియు డిజిటల్ చెల్లింపుల వంటి కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం కొంత సడలింపులను అనుమతించింది. అలాగే అవసరమైన సేవలను అందించడానికి అవసరమైన సర్వీసు ప్రొవైడర్లకు ప్రభుత్వం నుండి కొంత అనుమతి కూడా లభించింది.
ఏదేమైనా కరోనావైరస్ యొక్క వ్యాప్తిని నివారించే క్రమంలో సాధారణ ప్రజలందరూ ఇంటికే పరిమితం అవుతున్నారు. భారతదేశమంతటా పోలీసు బలగాలు రోడ్డు మీద ఉన్న ప్రజల వాహనాలను తనిఖీ చేయడానికి మరియు వారి ఇళ్ళ నుండి బయటకు రాకుండా చూడటానికి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
MOST READ:హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్ పై వెళ్లిన హీరో అజిత్ కుమార్
ఈ వీడియోలో మనం గమనించినట్లయితేపోలీసు బారికేడ్ వద్ద ఇద్దరు మహిళలతో కలిసి ఒక యువతి హ్యుందాయ్ కారు నడుపుతోంది. అంతకుముందు ఏమి జరిగిందో వీడియో చూపించలేదు కాని అమ్మాయి పోలీసుల మీద అరుస్తూ, కారుని ఎందుకు ఆపారని మరియు వారి సమస్య ఏమిటి అని అడగడంతో మొదలవుతుంది.
కారుని ఆపిన పోలీసులు వారిని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మరియు దానికి సంబంధించిన వాటిని వారిని అడిగారు. డ్రైవర్ సీట్లో ఉన్న అమ్మాయి పోలీసులను అరుస్తూ పత్రాలను కిటికీ నుంచి వెలుపల విసిరివేసింది. వెనుక సీట్లో కూర్చున్న మరొక లేడీ పేపర్లు సేకరించడానికి బయటకు వచ్చింది. డ్రైవర్ సీట్లో ఉన్న లేడీ బయటకు వచ్చి పోలీసులపై అరుస్తుంది. తరువాత ఆమె బిగ్గరగా ఏడుస్తుంది.
MOST READ: కూతురితో కలిసి బైక్ పై ప్రయాణించిన మహేంద్ర సింగ్ ధోని
ఆమె కారు వివరాలను ఆన్లైన్ అధికారిక రవాణా అథారిటీ పరిశీలించినప్పుడు, పోలీసులు కారుకు వ్యతిరేకంగా రెండు చలాన్లను జారీ చేసినట్లు తెలిసింది. ఎటువంటి కారణం చెప్పకుండా, పోలీసులు రెండుసార్లు రూ. 3,000 జరిమానా వసూలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ జరిమానా విధించి ఉంటారని ఊహించారు.
డ్రైవర్ సీట్లో నుంచి బయటకు వచ్చిన ఆ లేడీ బిగ్గరగా ఏడుపు ప్రారంభించి రోడ్డు మీద కూర్చుని ఉండగా, పోలీసులు ఆమెను ఓదార్చి కారు లోపల కూర్చోమని చెప్పారు. చివరికి లేడీ వాహనం లోపలికి రావడాన్ని చూడవచ్చు.
MOST READ:డ్యూటీలో ఉన్న హోమ్ గార్డ్ ని అవమానించిన వ్యవసాయాధికారి, చివరికి ఏమైందంటే..?
ఈ లాక్ డౌన్ సమయంలో వాహనాలు ప్రతి చెక్పాయింట్ వద్ద ఆగిపోవడం ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది. కానీ ఇటువంటి తనిఖీ దేశవ్యాప్తంగా ఇప్పుడు తప్పని సారి అయింది. ఇప్పటికే భారతదేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు యజమానుల వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.
చాలామంది అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కర్ఫ్యూ పాస్ లు జారీ చేస్తున్నాయి. బయటకు వెళ్ళినప్పుడు ప్రజలు పోలీసులకు తగిన ఆధారాలను చూపించి అవసరమైన సమాచారాన్ని అందించాలి మరియు ప్రయాణించడానికి సరైన కారణం చెప్పాలి.
MOST READ: కరోనా లాక్డౌన్ : చెల్లెలి కోసం 85 కి.మీ సైకిల్ పై వెళ్లిన అన్న