డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం దీనికి ప్రధాన కారణం. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా లేదు.

కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలోని దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్లు ఖాళీగా ఉండటం వల్ల ట్రాఫిక్ పరిమితం చేయబడింది. ఇదే సమయంలో కొంతమంది వాహనదారులు ఖాళీ రహదారులపై విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నారు. దీంతో లాక్డౌన్ కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య యధావిధిగా పెరిగింది.

కరోనా వైరస్ డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి పెద్దగా ఆంక్షలువిధించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంతో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగిపోతొంది. ఈ కారణంగా వారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం మళ్ళీ ప్రారంభించారు.

డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్న వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడే వారికి పోలీసులకు రూ. 10 వేల జరిమానా విధించారు.

మొదటిసారి పట్టుబడితే వారికి రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. రెండోసారి పట్టుబడితే వారికి పదివేల రూపాయల జరిమానా విధించబడుతుంది. అదనంగా అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ ఆదేశించింది.

భారతదేశంలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఒక ప్రధాన కారణం. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల అధిక సంఖ్యలో ప్రమాదాలు జరగడం దీనికి కారణం అవుతుంది.

ఈ కారణంగా ఈ విధమైన ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. భారీ జరిమానాలు విధించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అదనంగా ఆర్థిక సంక్షోభం కూడా ఎదుర్కొంటుంది. అటువంటి పరిస్థితిలో ఇంత మొత్తంలో జరిమానా విధించడం అనేది సరైన నిర్ణయమేనా అనేది ఒక ప్రశ్న.


Click it and Unblock the Notifications








