Just In
- 1 hr ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 2 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 3 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 4 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies కొత్త బాయ్ఫ్రెండ్తో మృణాల్ థాకూర్.. సీత మనసు దోచుకొన్న ఎవరీ యంగ్ హీరో అంటే?
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం దీనికి ప్రధాన కారణం. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా లేదు.
కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలోని దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్లు ఖాళీగా ఉండటం వల్ల ట్రాఫిక్ పరిమితం చేయబడింది. ఇదే సమయంలో కొంతమంది వాహనదారులు ఖాళీ రహదారులపై విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నారు. దీంతో లాక్డౌన్ కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య యధావిధిగా పెరిగింది.
కరోనా వైరస్ డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి పెద్దగా ఆంక్షలువిధించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారు.
MOST READ:జెసిబి ప్రమాదంలో బైకర్ ప్రాణాలు కాపాడిన మహీంద్రా బొలెరో; ఎలాగో తెలుసా ?
కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంతో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగిపోతొంది. ఈ కారణంగా వారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం మళ్ళీ ప్రారంభించారు.
డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్న వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడే వారికి పోలీసులకు రూ. 10 వేల జరిమానా విధించారు.
MOST READ:దొంగిలించిన ఎటిఎం కార్డు పాస్వర్డ్ అడగడానికి వచ్చిన దొంగ ; తర్వాత ఎం జరిగిందో తెలుసా !
మొదటిసారి పట్టుబడితే వారికి రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. రెండోసారి పట్టుబడితే వారికి పదివేల రూపాయల జరిమానా విధించబడుతుంది. అదనంగా అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ ఆదేశించింది.
భారతదేశంలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఒక ప్రధాన కారణం. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల అధిక సంఖ్యలో ప్రమాదాలు జరగడం దీనికి కారణం అవుతుంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుకి పెట్రోల్ నింపడానికి ట్రై చేసిన వ్యక్తి : ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఈ కారణంగా ఈ విధమైన ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. భారీ జరిమానాలు విధించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అదనంగా ఆర్థిక సంక్షోభం కూడా ఎదుర్కొంటుంది. అటువంటి పరిస్థితిలో ఇంత మొత్తంలో జరిమానా విధించడం అనేది సరైన నిర్ణయమేనా అనేది ఒక ప్రశ్న.
MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా