Just In
- 1 hr ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 1 hr ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
- 16 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 19 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
Don't Miss
- News తల పట్టుకున్న మాజీ ప్రధాని, మోదీ మాట వింటారా ?, ఫ్యామిలీ సమస్యలతో ఆ సీటు గోవిందా ?
- Technology ఆకట్టుకొనే డిజైన్, AI ట్రిపుల్ కెమెరా, 6.7 డిస్ప్లేతో మోటోరోలా స్మార్ట్ఫోన్.. విడుదల, సేల్ వివరాలు..!!
- Sports సన్రైజర్స్కు బ్యాడ్ న్యూస్.. నయా ఆల్రౌండర్ దూరం
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు శుభవార్త.. ఈ సారి జీతాల పెంపు ఎంత శాతమంటే..??
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Movies బ్రహ్మముడిని భారీ దెబ్బ కొట్టిన కార్తీక దీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు రీఎంట్రీతో అంతా ఛేంజ్!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఉపయోగిస్తే 10000 జరిమానా; ఎక్కడో తెలుసా
భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం దీనికి ప్రధాన కారణం. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య తక్కువగా లేదు.
కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలోని దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్లు ఖాళీగా ఉండటం వల్ల ట్రాఫిక్ పరిమితం చేయబడింది. ఇదే సమయంలో కొంతమంది వాహనదారులు ఖాళీ రహదారులపై విపరీతమైన వేగంతో ప్రయాణిస్తున్నారు. దీంతో లాక్డౌన్ కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య యధావిధిగా పెరిగింది.
కరోనా వైరస్ డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి పెద్దగా ఆంక్షలువిధించే అవకాశం ఉండదు. ఈ కారణంగానే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారు.
MOST READ:జెసిబి ప్రమాదంలో బైకర్ ప్రాణాలు కాపాడిన మహీంద్రా బొలెరో; ఎలాగో తెలుసా ?
కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరగడంతో పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగిపోతొంది. ఈ కారణంగా వారు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం మళ్ళీ ప్రారంభించారు.
డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్న వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు వాడే వారికి పోలీసులకు రూ. 10 వేల జరిమానా విధించారు.
MOST READ:దొంగిలించిన ఎటిఎం కార్డు పాస్వర్డ్ అడగడానికి వచ్చిన దొంగ ; తర్వాత ఎం జరిగిందో తెలుసా !
మొదటిసారి పట్టుబడితే వారికి రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. రెండోసారి పట్టుబడితే వారికి పదివేల రూపాయల జరిమానా విధించబడుతుంది. అదనంగా అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ రవాణా శాఖ ఆదేశించింది.
భారతదేశంలో పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఒక ప్రధాన కారణం. మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల అధిక సంఖ్యలో ప్రమాదాలు జరగడం దీనికి కారణం అవుతుంది.
MOST READ:ఎలక్ట్రిక్ కారుకి పెట్రోల్ నింపడానికి ట్రై చేసిన వ్యక్తి : ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఈ కారణంగా ఈ విధమైన ఉల్లంఘనలకు భారీగా జరిమానాలు విధించాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. భారీ జరిమానాలు విధించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అదనంగా ఆర్థిక సంక్షోభం కూడా ఎదుర్కొంటుంది. అటువంటి పరిస్థితిలో ఇంత మొత్తంలో జరిమానా విధించడం అనేది సరైన నిర్ణయమేనా అనేది ఒక ప్రశ్న.
MOST READ:వర్షపు నీటిలో పడవపై ప్రయాణించిన వ్యక్తిపై కేసు బుక్ చేసిన పోలీసులు : ఎందుకో తెలుసా